భూ కబ్జాదారులను సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి

 భూ కబ్జాదారులను సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి

టీజీ వెంకటేష్ మంత్రిగా ఉన్నప్పుడు వేయించిన సిమెంట్ రోడ్డును కూడా వదలని బిల్డర్
చెరువులు,వాగులు,ప్రభుత్వ భూముల కబ్జాలపై సర్వే వివరాలు ప్రజలకు తెలపాలి

కర్నూలు, న్యూస్ వెలుగు; జిల్లాలో వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు, రాజుల కాలం నాటి చెరువులు వాగులు వంకలు కబ్జాలకు గురైయ్యాయనీ ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం మారీ ఆరు నెలలు గడిచినా సర్వేల పేరుతో సంబంధిత అధికారులు కాలయాపన చేస్తూనే.. ఉన్నారు. కొన్ని సందర్భాల్లో అధికార పార్టీకి చెందిన నాయకులు భూకబ్జాలపై ఆగ్రహం వ్యక్తం చేసినా అధికారుల్లో తగినంత స్పందన రావడంలేదు. గార్గేయపురం చెరువు మీదుగా నగరవనం వెళ్లేందుకు గతంలో టీజీ వెంకటేష్ మంత్రిగా ఉన్న సమయంలో వేయించిన సిమెంట్ రోడ్డును కూడా ఆ ప్రాంతంలో ఉన్న బత్తుల బిల్డర్ వదలలేదనీ.. పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి, ఎం నాగరాజు, ఎస్ రమణ గౌడ్ ల ప్రతినిధి బృందం ఈరోజు ఉదయం కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఇచ్చిన వినతి పత్రంలో తెలిపారు. ప్రభుత్వ భూములు, బి తాండ్రపాడు, గార్గేయపురం చెరువులు, వరద నీరు వెళ్లే వాగులు, వంకలను కబ్జా చేసిన.వారితోపాటు, సహకరించిన అధికారులపై కూడా చర్య తీసుకోవాలని కోరారు. వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను, వాగులను చెరువులో కబ్జాల నుండి కాపాడి వాటిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని కోరారు.అభివందనములతో
ఇరిగినేని పుల్లారెడ్డి

Author

Was this helpful?

Thanks for your feedback!