
చురుగ్గా అభివృద్ధి పనులు
హోళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో శనివారం రాజా నగర్ కాలని నందు ఆలూరు తాలూకా ఇంచార్జీ వీరభద్ర గౌడ ఆదేశాల మేరకు ఎంజిఎన్ఆర్జిఎస్ నిధులతో రూ.10 లక్షలతో షేక్షవలి ఇంటి నుంచి గోవిందప్ప ఇంటి వరకు సీసీ రోడ్డు మరియు ఇరువైపులా డ్రైనేజ్ నిర్మాణం పనులు ప్రారంభించారు.ఈ సందర్భంగా టీడీపి నాయకులు రామాంజిని మాట్లాడుతూ చాలా కాలంగా సీసీ రోడ్డు లేక కాలని ప్రజలు ఇబ్బందులు పడేవారని ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రోడ్డు వేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో పిఆర్ఎఈ యమునప్ప,బుడగ జంగాల నాయకులు గోవిందు,రామయ్య తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!