ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించండి

ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించండి

పి.జి.ఆర్.ఎస్ వచ్చిన అర్జీలను గడవు లోపు పరిష్కారం అయ్యేటట్టు చర్యలు తీసుకోండి.

అర్జీలను నాణ్యతగా పరిష్కరించండి.

ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ 

ఆదోని, న్యూస్ వెలుగు ; పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్జిదారులను సంతృప్తిపరిచేలా చూడాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్  పేర్కొన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నందు పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్ లో సబ్ కలెక్టర్ పాల్గొని డివిజన్లోని ఆయా మండలాల నుంచి వచ్చిన ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. .మండలంలోని ఆయా శాఖల అధికారులకు సంబంధించిన సమస్యలను తెలియజేస్తూ గడువు లోపు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ ఎస్ ఎల్ ఏ లోకి వెళ్లకుండా చూడాలన్నారు.

మండలాల నుంచి వచ్చిన సమస్యలు కొన్ని. :-

1. ఎమ్మిగనూరు మండలం మల్కాపురం గ్రామానికి చెందిన లక్ష్మీకాంతరెడ్డి సంబంధించి సర్వేనెంబర్ 69 పైకి 8.39 ఎకరాల భూమి కలదు ప్రస్తుతం సదరు భూమి ఎల్ పి ఎం నంబర్ తప్పుగా నమోదు చేశారు. దయతో విచారణ చేసి సరైన నెంబర్ నమోదు చేయవలసినదిగా అర్జీ సమర్పించుకున్నారు.

2. ఆదోని పట్టణం 38వ వార్డు నందు నిర్మాణం అవుతున్న డ్రైనేజీ పనులు పూర్తిస్థాయిలో నిర్మాణం చేసి కాలనీలో ఉన్న డ్రైనేజ్ కాలువ సమస్యను తీర్చాలని 38వ వార్డు కాలనీ సభ్యులు అర్జీ సమర్పించుకున్నారు.

3. మంత్రాలయం మండలం సింగరాజునహళ్లి గ్రామానికి చెందిన రాజు సంబంధించి సర్వేనెంబర్ 75/ఏ3సి నందు రెండు ఎకరాల విస్తీర్ణం గల భూమి ఉన్నది. ప్రస్తుతం సదరు భూమి రీ సర్వే చేసిన అనంతరం 1.87 ఎకరాల మాత్రమే ఆన్లైన్ నందు చూపిస్తున్నది. మిగిలిన 13 సెంట్ల భూమిని కూడా విచారణ చేసి ఆన్లైన్ నందు నమోదు చేయవలసినదిగా అర్జీ సమర్పించుకున్నారు.

4. ఆదోని మండలం కుప్పగల్ గ్రామానికి చెందిన సయ్యద్ అహ్మద్ సంబంధించి సర్వేనెంబర్ 144/1 నందు 3.66 ఎకరాల భూమి ఉండగా ప్రస్తుతం సదరు భూమి ఆన్లైన్ నందు నమోదు కాలేదు దయతో విచారణ చేసి నా యొక్క పేరును ఆన్లైన్ నందు నమోదు చేయవలసినదిగా అర్జీ సమర్పించుకున్నారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్వాయర్స్ శ్రీనివాసరాజు, వేణు సూర్య, డిఎల్పిఓ నూర్జహాన్, ఆర్డబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పద్మజ, ఆర్ అండ్ బి డిప్యూటీ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, డిప్యూటీ డిఈఓ వెంకటరమణారెడ్డి, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ సత్యవతి, ఉప తాసిల్దార్లు గుండాల నాయక్, వలి భాష, తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!