
అధికారుల సమన్వయ లోపంతో కొలిక్కి రాని అడ్మిషన్ల ప్రక్రియ: మద్దిలేటిస్వామి
న్యూస్ వెలుగు డోన్ : నంద్యాల జిల్లా డోన్ పట్టణములో కేంద్రీయ విద్యాలయం అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించాలని, తాత్కాలికంగా కేటాయించిన ఐ టి ఐ నూతన భవనములో తరగతుల ను నిర్వహించి, విద్యా సంవత్సరం నష్టపోకుండా చూడాలని డోన్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్త(ఇంచార్జి )డాక్టర్ గార్లపాటి మద్దులేటీ స్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డోన్ లో గత ప్రభుత్వ హయములో మంజూరు అయినప్పటికి, ఇప్పటి వరకు ఎలాంటి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాలేదన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారములో కీ వచ్చిన తరువాతైన అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతాయి అనుకుంటే అధికారుల సమన్వయ లోపముతో, స్థలం నంద్యాల జిల్లా విద్యా శాఖ అధికారులకు అప్పగించాలని స్థానిక తహసీల్దార్ అడిగితే ఈ స్థలం మాకు కాదు ఇవ్వాలసింది, మాకు సంబంధం లేదు మీరు కేంద్రీయ విద్యాలయ అధికారులకు సరెండర్ చేయాలని చెప్పడముతో, కేంద్రీయ విద్యాలయ అధికారులతో మాట్లాడ డముతో వారు వచ్చి స్థలాన్ని చూసి అందులో కరెంట్ స్థంబాలు ఉన్నాయి వాటిని తొలగించాలని సూచించడం జరిగింది దీనితో విద్యుత్ శాఖ అధికారులకు లెటర్ రాస్తే, వారు పరిశీలించి వాటిని తొలగించడానికి దాదాపు 9 లక్షల దాకా ఖర్చు అవుతుందని చెప్పడముతో ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టి కీ తీసుకొని పోవడం జరిగిందని, అధికారులు చెబుతూ కాలయాపన చేస్తూన్నారని ఈ విదంగా అధికారులు మధ్య సమన్వయ లోపముతో ఆలస్యం చేస్తూన్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్రీయ విద్యాలయములో ప్రవేశాలు జరిగితే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రతి తరగతికి 40 మంది విద్యార్థుల ను తీసుకుంటే దాదాపుగా 200మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని, ఒక వేల ప్రవేశాలు జరగకుంటే 200 మంది విద్యార్థులు నష్టపోతారని వారు అన్నారు. కావున అధికారుల సమన్వయ తో ముందుగా తాత్కాలిక భవనములో నడపాలని, వెంటనే నంద్యాల జిల్లా కలెక్టర్ స్పందించి సమస్యను పరిష్కరించండానికి సంబంధిత అధికారుల కు ఆదేశాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.