
నూతన తహసీల్దార్ ను కలిసిన కూటమి పార్టీ నాయకులు
హోళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నూతన తహసీల్దార్ సతీష్ కుమార్ ను కూటమి పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఇందులో భాగంగా తహసీల్దార్ ను శాలువ పూలమాలలతో సత్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో నెలకొన్న రైతన్నల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు జాకీర్,వీరన్న గౌడ,అబ్దుల్ సుభాన్,మోహిన్,అతరహీమాన్, బెనకప్ప,అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda