
కనకదాసు ఆశ్రమానికి స్థలం కేటాయించండి
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో మంగళవారం సర్వే నంబర్ 373 నందు కనకదాసు ఆశ్రమానికి స్థలం కేటాయించాలని తహసీల్దార్ సతీష్ కు వినంతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనకదాసు ఆశ్రమం కోసం దాదాపు 7 సంవత్సరాలు అనుభవంలో ఉండి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న సర్వే నంబర్ 373 నందు 30 సెంట్ల భూమిని ప్రభుత్వం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ తనయుడు సోమప్ప, కురువ సంఘ నాయకులు గాదిలింగ,మల్లయ్య,పంపాపతి తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda