
ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో వలసలు
పాలకుల నిర్లక్ష్యం: కొత్తూరు సత్యం ఆవేదన
కర్నూలు, న్యూస్ వెలుగు; ఆంధ్ర ప్రాంతానికి చెందిన లక్షలాదిమంది తెలంగాణలో ఉపాధి ,ఉద్యోగాలు చేసుకోవలసిన దుస్థితి ఏర్పడిందని రాయలసీమ రాష్ట్ర ఉద్యమ నాయకులు కొత్తూరు సత్యనారాయణ గుప్త ఆవేదన వ్యక్తం చేశారు. .బుధవారం మధ్యాహ్నం ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలుపుతూ విభజన హామీలను నెరవేర్చడంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఆంధ్ర ప్రాంతానికి రావాల్సిన వాటా తెలంగాణ నుంచి రాకపోవడం పై ఎవరు నోరు మెదపడం లేదన్నారు . సంక్రాంతి కారణంగా సుమారు 5 లక్షల మంది హైదరాబాదు నుండి ఆంధ్ర ప్రాంతానికి వెళ్లారని ప్రచారం చోటు చేసుకోవడం చూస్తే ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్లు తెలంగాణలో వలసలకు వెళ్తున్నారా అనుమానాల వ్యక్తిమవుతున్నాయన్నారు. ఇప్పటికైనా పాలకులు ఆలోచన చేసి ప్రాంతాలవారీగా అభివృద్ధి చేస్తే ఎక్కడి వారు అక్కడ జీవనం సాగిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ అవకాశాలు పొందడానికి అవకాశం ఉంటుందన్నారు. సంక్రాంతి పండుగ కారణంగా హైదరాబాద్ నగరం తో పాటు మిగతా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆంధ్ర ప్రాంతం వారు లేకపోవడంతో బోసిపోతున్నాయని అభిప్రాయం కూడా ఉందన్నారు . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు. తెలంగాణలో వలసలకు వెళ్తుంటే తెలంగాణ ప్రాంతం వాళ్లు ఇతర ప్రాంతాలకు వలసలకు పోతున్నారని ఇది విడ్డూరం కాదా అని ఎద్దేవా చేశారు. రాయలసీమ ప్రాంతం బంగారు సిరులు పండించే ప్రాంతంగా మారుస్తామని రతనాలసీమగా మారుస్తామని మాటల్లో తప్ప చేతుల్లో లేదన్నారు. ఇకనైనా పాలకులు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు. ఆంధ్ర ప్రాంతంలో కోడిపందాలు, పేకాట, జూదము బహిరంగంగా జరుగుతున్న పోలీసులు ఎందుకు కేసులు నమోదు చేయాలని ఆయన ప్రశ్నించారు. కోడిపందాలు, ఎడ్ల పందాలు ఆడకూడదని చట్టం చెబుతున్న జంతు సంక్షేమ అధికారులు ఏం చేస్తున్నారని కూడా ఆయన ప్రశ్నించారు . కోట్లాది రూపాయలు చేతులు మారాయని, కోడిపందాల పేరుతో జరిగిన దందా.. ప్రభుత్వం ఎందుకు మౌనంగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నదని ఆయన ప్రశ్నించారు.