
పేద విద్యార్థులకు చేయూతనిస్తున్న ఉపాధ్యాయుడు అంగడి లోకేష్
విద్యను బోధించడంతోపాటు సేవకు అంకితమవుతున్న ఉపాధ్యాయుడు అంగడి లోకేష్
* తను చదువుకున్న పాఠశాలకు ప్రింటర్ అందజేత
* పదవ తరగతి విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్స్ పంపిణి.
తుగ్గలి, న్యూస్ వెలుగు; పాఠశాలల యందు విద్యార్థులకు విద్యను బోధించడంతోపాటుగా పాఠశాలల, విద్యార్థుల అభివృద్ధి సేవలలో ఉపాధ్యాయుడు అంగడి లోకేష్ అంకితమవుతున్నారు.జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలో సైన్సు ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తూ పలు సేవా కార్యక్రమాలలో ఉపాధ్యాయుడు అంగడి లోకేష్ తన వంతు సహాయాన్ని అందిస్తున్నారు. వివరాలలోకి వెళ్ళగా తుగ్గలి మండల పరిధిలోని గల మామిళ్లకుంట గ్రామం నందు అంగడి లక్ష్మీదేవి,రిటైర్డ్ ఉపాధ్యాయుడు నాగభూషణం దంపతుల కుమారుడు అంగడి లోకేష్ తన విద్యాభ్యాసాన్ని తుగ్గలిలోని ప్రభుత్వ పాఠశాలల యందు విద్యాభ్యాసాన్ని అభ్యసించారు. అనంతరం 2000 సంవత్సరంలో డీఎస్సీ పరీక్షలో స్కూల్ అసిస్టెంట్ గా విధులను నిర్వహిస్తూ,జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల యందు సైన్సు ఉపాధ్యాయులుగా విధులను నిర్వహించారు.ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ పేద విద్యార్థుల కొరకు తన వంతు సహాయంగా నగదు,వస్తు ప్రోత్సాహకాలను విద్యార్థులకు అందజేసేవారు.పిల్లలకు సైన్స్ పట్ల అవగాహన పెంపొందించడానికి ప్రయోగాల ద్వారా విద్యార్థులకు వివరించేవారు. సైన్స్ డే సందర్భంగా విద్యార్థులతో వివిధ రకాల ప్రయోగాలను నిర్వహించి, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేసేవారు. 1988లో ప్రభుత్వం చేత విజ్ఞ వారితోషికాన్ని ఆయన సాధించారు. పదవ తరగతి విద్యార్థులు పరీక్షలలో రాణించి ఉత్తమ ప్రతిభ కనబరిచాలని ఉచితంగా స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు.అదేవిధంగా తను చదువుకున్న తుగ్గలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు తనవంతుగా ప్రింటర్ ను ఉచితంగా అందజేశారు.అదేవిధంగా క్రీడలలో ప్రతిభ కనపరిచిన 12 మంది ఖోఖో క్రీడాకారులకు ఉచితంగా క్రీడా దుస్తులను పంపిణీ చేశారు.అదేవిధంగా మండల విద్యాధికారి రమా వెంకటేశ్వర్లు చేతుల మీదుగా విద్యార్థులకు ఉచితంగా బెల్ట్,టైలను ఉచితంగా పంపిణీ చేశారు.అదేవిధంగా తన స్వగ్రామమైన మామిళ్ళకుంట గ్రామం నందు ప్రాథమిక పాఠశాల యందు విద్యార్థులకు పుస్తకాలను,ప్లేట్లను మరియు క్రీడా వస్తువులను పంపిణీ చేశారు. అదేవిధంగా పదవ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు తన వంతు సహాయంగా నగదు ప్రోత్సాహాలను ఆయన అందించారు. ఈయన చేసిన సేవలకు గాను విద్యా కమిషనర్ సంధ్యారాణి ఉపాధ్యాయుడు అంగడి లోకేష్ ను ప్రశంసించారు. ప్రస్తుతం ఆయన పిఆర్టియు జిల్లా కార్యదర్శిగా ఉంటూ టీచర్ల సమస్యలు వాటి పరిష్కారం కోసం ఆయన కృషి చేస్తున్నారు.ఈ సందర్భంగా అంగడి లోకేష్ మాట్లాడుతూ పేద విద్యార్థుల విద్య కోసం తన వంతు కృషి చేస్తానని ఆయన తెలియజేశారు.విద్యార్థులు విద్యతోనే ఉన్నత శిఖరాలను చేరుకొని తల్లిదండ్రులకు,గురువులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన తెలియజేశారు.ఈయన సేవల పట్ల గ్రామ ప్రజలు,పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు అభినందిస్తున్నారు. ప్రస్తుత సమాజంలో ఆదర్శ ఉపాధ్యాయులుగా ఆయన నిలుస్తున్నారని పలువురు ప్రశంసిస్తున్నారు.