ముగిసిన అంగన్వాడీ టీచర్ల శిక్షణ కార్యక్రమం

ముగిసిన అంగన్వాడీ టీచర్ల శిక్షణ కార్యక్రమం

హొలగుంద, న్యూస్ వెలుగు ప్రతినిధి: అంగన్వాడి కేంద్రాల యందు ప్రాథమిక విద్య బలోపేతం చేయడంలో ఆరు రోజులు నిర్వహించిన అంగన్వాడీ టీచర్లకు శిక్షణ కార్యక్రమం హోళగుంద యబ్బటం జడ్పీ హైస్కూల్ నందు మంగళవారం ముగిసింది. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా పిల్లలలో సమగ్ర అభివృద్ధి పెంపొందించేలా వస్తువుల ద్వారా నేర్పిస్తూ,వివిధ రకాల ఆటలు, కృత్యాల ద్వారా పిల్లల సంపూర్ణ అభివృద్ధికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. చివరి రోజు శిక్షణ కార్యక్రమంలో భాగంగా మండల విద్యాధికారి జగన్నాథ ప్రధానోపాధ్యాయులు నజీర్ హమద్,రంగన్న ,హాజరై విద్యార్థుల నైపుణ్యతను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో శిక్షణ బోధించే ఉపాధ్యాయులు ధనుంజయ ,శేఖరప్ప, సూపర్వైజర్లు శిబారాణి ,అంగన్వాడి టీచర్లు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!