
రాంపల్లిలో ప్రారంభమైన పశుఆరోగ్య శిభిరం
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండలం పరిధిలోని రాంపల్లి గ్రామంలోని స్థానికంగా ఉన్న గ్రామ పశువుల కార్యాలయంలో పత్తికొండ నియోజకవర్గ శాసనసభ సభ్యులు కేయి శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు రాంపల్లి గ్రామంలో మండల టీడీపీ కన్వీనర్ ఆర్ తిరుపాల్ నాయుడు, గ్రామ మాజీ ఎంపీటీసీ సభ్యులు ఆర్ శ్రీనివాసులు పశువుల వైద్యాధికారి వారి మిత్ర బృందం గ్రామంలోని రైతుల పశువులను పరిశీలించి పశువులకు ఆరోగ్య సంబంధమైన వైద్య సేవలు చేశారు.ఈ సందర్బంగా మండల టీడీపీ కన్వీనర్ రాంపల్లి తిరుపాల్ నాయుడు మాట్లాడుతూ గ్రామంలోని గ్రామ ప్రజల రైతులకు ఉన్న పెంపుడు జంతువులైన ఆవులు,ఎద్దులు,గేదెలకు,గొర్రెలకు, మేకలకు మొదలైన పశువులకు ఆరోగ్య సమస్యలకై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పశు వైద్య శిభిరాలను ఈనెల 20 వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తుండడంతో రాంపల్లి గ్రామంలో పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించడం సంతోషమని,పశువుల అనారోగ్య సమస్యలకు వైద్యాధికారి ఏదకు రాని పశువుల పశువులకు చికిత్స చేసి, కృత్రిమ గర్భదారణ చేసిన పశువులకు చూడి పరీక్షలు నిర్వహించి,గ్రామంలోని సన్న జీవుల నట్టల నివారణకు మందులు టీకాలు వేసి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని మండల టీడీపీ కన్వీనర్ తిరుపాల్ నాయుడు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రాంపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ సభ్యులు ఆర్ శ్రీనివాసులు,పశు వైద్య సిబ్బంది పశు సంవర్ధక సహాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.