
వైద్య విద్యార్థులకు అన్యాయం చేస్తున్న ఏపీ ప్రభుత్వం
మదనపల్లి ప్రభుత్వ మెడికల్ కళాశాల నడపలేము అని రాష్ట్ర ప్రభుత్వం ఎన్ ఎం సి కి రాసిన లేఖను ఉపసంహరించుకోవాలి
మదనపల్లి మెడికల్ కళాశాల ఆపిన కన్స్ట్రక్షన్ తిరిగి ప్రారంభించాలి.
ప్రభుత్వం మెడికల్ కళాశాలలపై రాయలసీమ పట్టబద్రుల గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎందుకు మాట్లాడటం లేదు
మదనపల్లె, న్యూస్ వెలుగు; స్థానిక మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులతో నిరసన తెలియజేసి కార్యాలయంలోని AO పద్మావతి గారికి వినతిపత్రం అందజేశారు,
ఈ సందర్భంగా రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు జగన్ మాట్లాడుతూ, ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఐదు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు అందుబాటులోకి రావాల్సి ఉండగా అయితే సెకండ్ ఫేస్ లో పాడేరు, పులివెందులకు నేషనల్ మెడికల్ కౌన్సిలింగ్ వారు ఎంబిబిఎస్ సీట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తే ఐతే కూటమి రాష్ట్ర ప్రభుత్వం పాడేరుకు 50 సీట్లు చాలు పులివెందుల మెడికల్ కళాశాల అన్ని వసతులతో పూర్తయిన దీనిని మేము నడపలేము అదేవిధంగా మదనపల్లి ఆదోని వీటిని కూడా మేము చేయలేము అని నేషనల్ మెడికల్ కౌన్సిలింగ్ అథారిటీ వారికి చంద్రబాబు నాయుడు లేఖ రాయడం పేద మధ్యతరగతి విద్యార్థులకి వైద్య విద్యను అందించడంలో మోసం చేసినట్టేనని వారు విమర్శించారు, దీన్ని బట్టి చూస్తే వైద్య విద్యను ప్రైవేటీకరణ చేసే దిశగా కుట్ర జరుగుతుందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వం 107 ,108 జీవోను రద్దు చేస్తామని చెప్పి యధావిధిగా కొనసాగించడం అంటే వైద్య విద్యను అమ్మడం కాదా అని వారు విమర్శించారు, రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం అని చెప్పి ప్రభుత్వం మెడికల్ కళాశాలల విషయంపై నోరు ఇప్పక పోవడంలో అంతర్య మేమని వారన్నారు,ఈ ప్రాంత విద్యార్థులను నిరుద్యోగులను ఓట్ల సీట్ల కోసం వాడుకున్నారూ తప్పా సమస్యలపై స్పందించడంలో రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు విమర్శించారు, వైద్య విద్య కోసం విదేశాలకు వలస వెళుతున్నటువంటి విద్యార్థులు కోట్లు పెట్టి నష్టపోతున్న సంగతి ప్రభుత్వం గుర్తుంచుకోవాలని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వీటన్నింటినీ గమనించి ఎన్ఎంసికి రాసిన లేఖను ఉపసంహరించుకొని ఏది ఏమైనా మదనపల్లె మెడికల్ కళాశాలను కన్స్ట్రక్షన్ అన్ని వసతులతో పూర్తి చేసి వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలని లేని పక్షంలో విద్యార్థులను చైతన్యం చేసి ఉద్యమాలకు శ్రీకారం చుడతామని రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (RSO) గా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమంలో విద్యార్థులు మదన్ నాయక్ వంశీ సురేష్ నరేష్ వినయ్ తదితరులు పాల్గొన్నారు.