
APGB ప్రధాన కార్యాలయం – కడప లొనే కొనసాగించాలి
కర్నూలు, న్యూస్ వెలుగు; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు గ్రామీణ బ్యాంకులు కలిసి ఒకే గ్రామీణ బ్యాంకుగా ఏర్పడుతున్నందున, కడపలో ఉన్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయన్ని కొనసాగించాలని సేవ్ పబ్లిక్ సెక్టార్ కమిటీ ప్రతినిధులు బైరెడ్డి రాజశేఖర రెడ్డ మాజీ ఎమ్మెల్యే , కలసి విన్నవించడం జరిగింది.కడప ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్నటువంటి ఏ పీ జీ బీ మిగతా గ్రామీణ బ్యాంకులతో పోలిస్తే అతి పెద్దది కావడం, గతంలో ప్రభుత్వం కేటాయించిన స్థలంలోనే సొంత భవనం కలిగి ఉండడం, దక్షిణ భారత దేశంలో ఏ గ్రామీణ బ్యాంకు కు లేనటువంటి కరెన్సీ చెస్ట్ సౌకర్యం కలిగి ఉండడంతో పాటు అత్యంత వెనుకబడిన ప్రాంతంలో ఉండడం వలన ప్రతిపాదిత గ్రామీణ బ్యాంకు కడప లోనే కొనసాగించడం అత్యంత ఆవశ్యకమని కోరడం జరిగింది.
నూతనంగా ఏర్పడబోతున్న, ఈ గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయం, కడప నుండి అమరావతికి తరలిపోతుందన్న ఆందోళన, ఈ ప్రాంత ప్రజల్లో వుంది. అత్యంత కరువు ప్రాంతాల్లో పనిచేస్తున్నప్పటికీ, అత్యధిక లాభాలు, అత్యధిక నిలువలు మరియు వ్యాపారంతో, ప్రత్యేకంగా వెనుకబడిన వర్గాలకు రుణాలు ఇవ్వడంలో, కీలకపాత్ర పోషిస్తున్న గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయం తరలిపోవడమనేది, ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం తప్పక చూపుతుంది. మిగతా ప్రాంతాలతో పోల్చి చూసుకుంటే, వెనుకబడిన రాయలసీమలో ఎటువంటి ముఖ్యమైన కార్యాలయములు కానీ సంస్థ యొక్క కార్యాలయాలు లేకపోవడం, మిగతా ప్రాంతంలో అనేక కార్యాలయాలు కలిగి ఉండడమనేఅంశాల్ని పరిగణలోకి తీసుకొని… నూతనంగా ఏర్పడబోయే గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయం కడపలోనే కొనసాగించాలని ఇక్కడ ప్రజల ఆకాంక్షగా వున్నది. కాబట్టి, ఈ అంశం పట్ల దృష్టి సారించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, కడప నుండి ప్రధాన కార్యాలయం తరలి వెళ్లకుండా చూడగలరని కోరారు.
ఇందుకు రాజశేఖర రెడ్డి స్పందిస్తూ, ఖచ్చితంగా తన వంతు కృషిని చేయగలనని, ఉంది CM గారితో మాట్లాడి కడపలోనే హెడ్ క్వార్టర్స్ కొనసాగేలా చూడగలనని చెప్పడం జరిగింది. సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ వెనుకబాటు తనం గురించి ఈ ప్రాంత ప్రజానీకం ఆలోచించాల్సిన ఆవశ్యకత అనివార్యంగా తయారయ్యే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో సేవ్ పబ్లిక్ సెక్టార్ కమిటీ నాయకులు E.హన్మంత్ రెడ్డి, D. రియాజ్ బాషా, P.సురేష్, MCV రమణా రెడ్డి, K.నాగరాజు, వెంకటేష్, K.రవి తదితరులు పాల్గొన్నారు.