
ఏపీజీబీ ప్రధాన కార్యాలయం కడపలోనే కొనసాగించాలి
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో కడపలోనే వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం రోజున తుగ్గలిలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మరియు రైతులు కలసి ధర్నాను నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి సర్కారు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయం తరలింపునకు కార్యాచరణ మొదలుపెట్టిందని,తాజాగా కడపలోని ఏపీజిబి ప్రధాన కార్యాలయాన్ని విలీనం పేరుతో అమరావతికి తరలించడానికి కుతంత్రం పన్నుతుందన్నారు.1976లొ రాయలసీమ గ్రామీణ బ్యాంక్ పేరుతో గ్రామీణులకు బ్యాంకింగ్ సేవలు చేరవేయడంలో భాగంగా కార్యకలాపాలకు శ్రీకారం చుట్టిందని, 2006లొ రాయలసీమ,అనంత, పినాకిని బ్యాంకులను కలిపి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు గా మార్పు జరిగిందన్నారు. గ్రేటర్ రాయలసీమ ఉమ్మడి జిల్లాలైన కడప,కర్నూల్, అనంతపురం,ప్రకాశం,నెల్లూరు జిల్లాలో 551 శాఖలు 2850 ఉద్యోగులతో సేవలందిస్తుందని,18 వేల కోట్ల టర్నోవర్ తో కూడిన వ్యాపార కార్యకలాపాలను సాగిస్తుందన్నారు.25 వేల కోట్ల రుణాలు,22 వేలకోట్ల డిపాజిట్లు ఉన్నాయని ఆయన తెలియజేశారు. అత్యధికంగా 85 శాతం మేర వ్యవసాయ రుణాలను 7 లక్షల మంది గ్రామీణ రైతులకు అందిస్తుందని, ఆదాయ రిత్యా పెద్ద బ్యాంకు గా ఏపీజీబీ నిలిచిందని,అలాంటి బ్యాంకులను అమరావతికి తరలించడం రైతులను ఇబ్బంది పెట్టడమే అని ఆయన అన్నారు.ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం బ్యాంకు తరలింపును వెంటనే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఈశ్వరప్ప,రైతులు ఉప్పర రాముడు,సురేష్ యాదవ్,నగేష్, రాజన్న,లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.