
. పారామెడికల్ కోర్సులకు “మూడవ ఫేజ్ అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానం
కర్నూలు, న్యూస్ వెలుగు; పారామెడికల్ కోర్సులలో చేరటానికి మొదటి, రెండవ ఫేజ్ లో కౌన్సిలింగ్ లు పూర్తి కాగా మిగిలిన 6 సీట్లకు కి మూడవ ఫేజ్ క్రింద అడ్మిషన్ ల కోసం నూతనంగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, కర్నూల్ మెడికల్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే. చిట్టి నరసమ్మ బుదవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోర్సులు వాటిలో అందులో సీట్లు వాటికి వర్తించే రోస్టర్ కింద తెలుపుతున్నాం అని ఇంటర్మీడియట్ బై . పి.సి విద్యార్హత కలిగిన ఆయా రోస్టర్ కేటగిరి కి చెందిన విద్యార్థులు మాత్రమే రు.100/- చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తులు 6 -11- 2024 సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించ బడునని, దరఖాస్తు చేసుకున్న వారికి 8 -11-2024 న ఉదయం 10 గంటలకి కౌన్సెలింగ్ వుంటుంది అని అన్ని ఒరిజనల్ సర్టిఫికెట్ లతో హాజరు కావాలని తెలిపారు.. కోర్స్/సీట్ల సంఖ్య/రోస్టర్ వివరాలు క్రింద విధంగా ఉన్నాయి. D. డార్క్ రూం అసిస్టెంట్ కోర్స్ లో BC(D) కు 1 సీటు,BC (A) కు 1 సీటు, DMIT కోర్స్ లో ST కి 1 సీటు, D. అనస్థీషియా కోర్సులో BC -C కి 1 సీటు,బీసీ(D) కి 1 సీటు, DMLT కోర్స్ లో BC-C కి 1 సీటు అందుబాటులో వున్నాయని వివరాల కోసం www.appmb.co.in లేదా appsahpc.co.in వెబ్ సైట్ ను సంప్రదించ వలసింగా తెలిపారు.