
కనీసం కంటైనర్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయండి
కర్నూలు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొత్తూరు సత్యం
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూల్ కేంద్రంలో కంటైనర్ లో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొత్తూరు సత్యనారాయణ గుప్తా కోరారు. సోమవారం ఉదయం కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా గారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి దేశానికి సేవలు అందించిన ఎంతోమంది నాయకుల చరిత్ర కర్నూలుకు ఉందని , కానీ కర్నూల్ కేంద్రంలో ప్రెస్ క్లబ్ లేకపోవడం బాధాకర విషయం అన్నారు. ఎంతోమంది జర్నలిస్టులు ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు దీక్షలు, ధర్నాలు నిరసన చేసిన కొంతమంది నాన్ లోకల్ జర్నలిస్టుల ఒత్తిడి మేరకు జిల్లా కలెక్టర్లు అడుగులు ముందు వెయ్యలేకపోయారు అని తెలిపారు . గత కలెక్టర్ వీర పాండ్యన్ ఆధ్వర్యంలో జరిగిన తుంగభద్ర పుష్కరాల విజయవంత సభలో కర్నూల్ కేంద్రంలో ఐదు ,ఆరు నెంబర్లు క్వార్టర్స్ కేటాయించడం జరిగిందన్నారు .కానీ ఫైలు కదల్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కర్నూల్ కేంద్రంలో తక్కువ ఖర్చుతో కూడిన కంటైనర్ తో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని అందుకు కర్నూలు సమాచార పౌర సంబంధాల శాఖ ఆవరణలో 10 సెంట్లు స్థలం కేటాయిస్తే, అందులో ఐదు సెంట్లు ప్రెస్ క్లబ్ కు మరో ఐదు సెంట్లు వివిధ ప్రాంతాల నుండి వచ్చే పాత్రికేయులకు విశ్రాంతి తీసుకునేందుకు ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ప్రెస్ క్లబ్ వల్ల సామాన్యుల కష్టాలు చెప్పుకునేందుకు వేదిక అవుతుందని ఆయన తెలిపారు. దీనిపై కలెక్టర్ తన వినతిపత్రానికి సమాధానం చెబుతూ ఈ విషయంపై జాయింట్ కలెక్టర్ మరియు కర్నూలు సమాచార పౌర సంబంధాల శాఖ డిడి సమావేశమై నిర్ణయం తీసుకొని తగు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారని కొత్తూరు సత్యనారాయణ గుప్త తెలిపారు.