
బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు దారుణం
హోళగుంద, న్యూస్ వెలుగు: బంగ్లాదేశ్ లో హిందువుల పై దాడులను తీవ్రంగా ఖండిస్తూ బుధవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు డిప్యూటీ తహసీల్దార్ నిజాముద్దీన్ కు వినంతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగ్లాలో హిందువుల పై దాడులు దారుణమన్నారు.అంతేకాకుండా హిందూ గురువు చిన్మయ కృష్ణదాస్ ను అక్రమంగా అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసిందని ఈ విషయం పై కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు ప్రసాద్,బిశ్వాస్,తిక్క స్వామి,మల్లయ్య,బెనకప్ప తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!