సూపర్ సిక్స్ హామీల అమలుపై శ్రద్ధ చూపాలి

సూపర్ సిక్స్ హామీల అమలుపై శ్రద్ధ చూపాలి

జమ్మలమడుగు సమగ్ర అభివృద్ధి కోసం సిపిఎం పట్టణ కమిటీ మహాసభలు జయప్రదం చేయండి

జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; నవంబర్ 19,20 తేదీలలో సిపిఎం జమ్మలమడుగు పట్టణ మహాసభలు రెండు రోజుల పాటు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని సీపీఎం పట్టణ కార్యదర్శి జి ఏసుదాస్ కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ మహాసభలలో పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కోసం వెనుకబడిన ప్రాంతాలకు నిధులు నికరజలాలు పరిశ్రమల కోసం రాబోయే కడప జిల్లా మహాసభలలో చర్చించి భవిష్యత్ కార్యచరణ రూపొందించుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ మహాసభల సందర్భంగా ర్యాలీ ప్రదర్శన బహిరంగ సభ ఉంటుందని జిల్లా కమిటీ నాయకులు పాల్గొంటారని ఆయన తెలిపారు. పట్టణ , జిల్లా మహాసభలు జయప్రదానికి సహాయ సహకారాలు అందించాలని ఆయన పట్టణ ప్రజానీకానికి పిలుపునిచ్చారు
అంతేకాక సూపర్ సిక్స్ హామీల అమలుపై శ్రద్ధ చూపాలనీ తెలుపుతూ ఎన్నికల ముందు టిడిపి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుపై శ్రద్ధ పెట్టడంలో విఫలం కనిపిస్తుందని తెలిపారు. సూపర్ సిక్స్ హామీలలో రైతులకు పెట్టుబడి సహాయం రూ.20 వేలు, తల్లికి వందనం , విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, యువతకి నిరుద్యోగ భృతి , గృహ మహిళలకి నెలకి 1500, ఉచిత బస్సు సౌకర్యం పై స్పష్టత లేదని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఇస్తున్న ఉచిత ఇసుక విధానంలో కూడా ఆచరణలో చాలా గందరగోళం ఉన్నదని ఆయన తెలిపారు. గతంలో వైసిపి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం చెందారని ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే బాటలోనే పయనిస్తున్నారని ప్రజల గమనిస్తున్నారని ఆయన తెలిపారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం గతంలో దీక్షలు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కేంద్రంలో ఎన్డీఏ లో భాగస్వామ్యం అయినా కూడా వెనుకబడిన ప్రాంతాలకు నిధులు పరిశ్రమలు తీసుకురావడంలో ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ నాయకులు ఏ.వినయ్ కుమార్, డి.విజయ్, వై.అబ్రహం పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!