కిడ్నీల ఆరోగ్యం పై అవగాహన

కిడ్నీల ఆరోగ్యం పై అవగాహన

నెఫ్రాలజిస్ట్​ డా. రవికుమార్​
‘ జెమ్​ కేర్​ కామినేని’లో.. కిడ్నీ స్ర్కీనింగ్​ కు స్పెషల్​ ప్యాకేజీ

కర్నూలు, న్యూస్​ వెలుగు; కిడ్నీల ఆరోగ్యంపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, లేదంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందన్నారు జెమ్​ కేర్​ కామినేని హాస్పిటల్​ ప్రముఖ నెఫ్రాలజిస్ట్​ డా. రవి కుమార్​. కిడ్నీలను సంరక్షించుకునేందుకు ‘ జెమ్​ కేర్​ కామినేని హాస్పిటల్​ లో మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్నామన్నారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా గురువారం నగరంలోని జెమ్​ కేర్​ కామినేని హాస్పిటల్​ లో కిడ్నీ డే వేడుకలు నిర్వహించారు. హాస్పిటల్​ సీఈఓ, ఎం.డి డా. చంద్ర శేఖర్​ నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నెఫ్రాలజిస్ట్​ డా. రవి కుమార్​, డా. సతీష్​ కేక్​ కట్​ చేసి హాస్పిటల్​ సిబ్బందికి, రోగులకు, వారి బంధువులకు పంచారు. ఈ సందర్భంగా కిడ్నీ లను కాపాడుకునేందుకుగాను స్క్రీనింగ్​ టెస్టుల కోసం రూ.3180 అయ్యే ఖర్చు కు రూ.499 మాత్రమే ప్రత్యేక ప్యాకేజికి సంబంధించిన వోచర్​ను విడుదల చేశారు. అనంతరం జెమ్ కేర్​ కామినేనిలో 35 మంది డయాలసిస్ట్​ పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. వారిలో రెగ్యులర్​ పేషెంట్లను సన్మానించారు. ఈ సందర్భంగా నెఫ్రాలజిస్ట్​ డా. రవి కుమార్​ మాట్లాడుతూ మందు, మద్యం, పొగ తాగడం వంటి వాటికి దూరంగా ఉండాలని, ప్రతి రోజు వ్యాయామం చేస్తే కిడ్నీల ఆరోగ్యం సురక్షితంగా ఉంటుందన్నారు. మధుమేహం, రక్తపోటు, ఊబకాయం వ్యాధిగ్రస్తులకు కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంటుందని, వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జెమ్​ కేర్​ కామినేని హాస్పిటల్​ ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ మార్చి 13 నుంచి ఏప్రిల్​ 13 వరకు మాత్రమే ఉంటుందన్నారు. ప్యాకేజీలో భాగంగా ఆర్​బిఎస్​, సిబిపి, సియూఈ, సెరమ్​ క్రిటినిన్​, అబ్​డమెన్​ అల్ర్టా సౌండ్​ తోపాటు నెఫ్రాలజి వైద్యులు ఉచితంగా ఓపీ చూస్తారని ఈ సందర్భంగా నెఫ్రాలజిస్ట్​లు డా. రవి కుమార్​, డా. సతీష్​ వెల్లడించారు. కార్యక్రమంలో డైరెక్టర్​ ఆర్థో పెడిక్​ వైద్యులు డా. రవి బాబు , ఎమర్జెన్సీ హెడ్​ డా. రామ్మోహన్​, న్యూరాలజిస్ట్​ డా. నిషాన్ , సీఈఓ డా. గణేష్​ , ఏజీఎం డా. కృష్ణ, నదీమ్​​ జిఎం ఆపరేషన్ , ​రమణ డిజే మార్కెటింగ్​ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!