
స్పర్శ కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమం
మద్దికేర, న్యూస్ వెలుగు ప్రతినిధి: స్పర్శ కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమం జనవరి 30 నుండి ఫిబ్రవరి 13వ తేదీ వరకు ఆశా కార్యకర్తల ద్వారా క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి ప్రజలకు కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు మద్దికేర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ శ్రీ లక్ష్మి తెలిపారు.గురువారం రోజున ఈ కార్యక్రమంలో భాగంగా వైద్యాధికారిని డాక్టర్ శ్రీలక్ష్మి వైద్య ఆరోగ్య సిబ్బందిచే కుష్టు వ్యాధి నిర్మూలనపై ప్రతిజ్ఞ నిర్వహించారు.అనంతరం వైద్యాధికారిణి డాక్టర్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ చర్మంపై స్పర్శ లేని రాగి రంగు మచ్చలు,కనురెప్పలపై వెంట్రుకలు రాలిపోవడం,అరికాళ్ళలో స్పర్శ లేకపోవడం వంటివి కుష్టు అనుమానిత లక్షణాలు అని దీనిని ముందుగానే గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా లభించే మందులను వాడటం వల్ల వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నిరంజన్ బాబు,హెల్త్ ఎడ్యుకేటర్ అక్బర్ బాషా,లెప్రసీ నోడల్ ఆఫీసర్ కృష్ణమ్మ, హెల్త్ ప్రొవైడర్ మంజుల,ఫార్మసిస్ట్ జ్యోతిబాయ్,హెల్త్ సెక్రటరీలు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.