రమణీయం….జగద్గురువుల అడ్డ పల్లకి మహోత్సవం

రమణీయం….జగద్గురువుల అడ్డ పల్లకి మహోత్సవం

ముగిసిన శ్రీ సజ్జల గుడ్డద శరణమ్మ అవ్వ పురాణ ప్రవచన కార్యక్రమం.
ఎల్లార్తిలో పండుగ వాతావరణంలో అడ్డ పల్లకి మహోత్సవం.
తరలి వచ్చిన అశేష భక్త జనం
హోళగుంద, న్యూస్ వెలుగు: గత 5 రోజుల నుంచి ఎల్లార్తి గ్రామంలో ఏర్పాటు చేసిన శ్రీ సజ్జల గుడ్డద శరణమ్మ అవ్వ పురాణ ప్రవచన కార్యక్రమం బుధవారం వైభవంగా ముగిసింది.ప్రధానంగా పురాణం ప్రవచన ముగింపు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన డాక్టర్ శ్రీ చన్న సిద్దరామ పండితారాధ్య శివాచార్యులు శ్రీశైల పీఠం వారి అడ్డ పల్లకి మహోత్సవం రణీయంగా సాగింది.ముందుగా గ్రామ శివారు నుంచి జగద్గురువుల అడ్డ పల్లకినీ మేళాతాళాలతో,డప్పు వాయిద్యాలతో,నందికోలు,వీరభద్రేశ్వర స్వామి వేషధారులు వీరగాసే నృత్యాలు చేస్తూ గ్రామ పురవీధుల్లో ఊరేగింపుగా శ్రీ ఈశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు.అనంతరం శ్రీ చన్నవీర శివాచార్య మహాస్వాములు పాల్తూరు,శ్రీ అజాత శంభులింగ శివాచార్య మహాస్వాములు జంగమర హోసల్లీ,శ్రీ శివయోగి శివాచార్య మహాస్వాములు రౌడకుంది వాటి చేతుల మీదుగా 1011 మంది మహిళలకు ఊడి బియ్యం వేశారు.9 మంది జంగమ మూర్తులకు అయ్యాచారం చేపట్టారు.అనంతరం జగద్గురువుల తులా భార కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమానికి చుట్టూ పక్కల,మండలాలు,గ్రామాల నుంచి అశేష భక్త జనం హాజరై కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో దిగ్విజయం చేశారు.అలాగే కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.మరియు కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది గట్టి బందోబస్తు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శ్రీ చన్నవీర శివాచార్య మహాస్వాములు పాల్తూరు,శ్రీ అజాత శంభులింగ శివాచార్య మహాస్వాములు జంగమర హోసల్లీ,శ్రీ శివయోగి శివాచార్య మహాస్వాములు రౌడకుంది, మండలం పెద్దలు రాజా పంపన గౌడ శివ శంకర్ గౌడ చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!