బోకే వద్దు మొక్కే ముద్దు జన విజ్ఞాన వేదిక పిలుపు

బోకే వద్దు మొక్కే ముద్దు జన విజ్ఞాన వేదిక పిలుపు

న్యూస్ వెలుగు, కర్నూలు; నూతన సంవత్సర వేడుకలను పూల మొక్కలతో జరుపుకోవాలని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు కార్యక్రమం నిర్వహించారు. పూల బొకెలు, స్వీట్లు, గ్రీటింగ్ కార్డులకు బదులు పూల మొక్కలు ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ కోరారు. బొకేలు, గ్రీటింగ్ కార్డుల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని పూల మొక్కలు ఎంతగానో ఉపయోగపడుతుందని వారు తెలిపారు.శ్రీరాములు మాట్లాడుతూ బోకే వద్దు మొక్కే ముద్దు అంటూ జన విజ్ఞాన వేదిక రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు నిచ్చిందని ప్రతి ఒక్కరు పూల మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. ఈకార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక. రాష్ట్ర అధ్యక్షుడు. సురేష్,జన విజ్ఞాన వేదిక నాయకులు. శ్రీరాములు,మణిక్యం,మధు‌,రామాంజనేయులు, శేషగిరి తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!