అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జయప్రదం చేయండి

 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జయప్రదం చేయండి

కర్నూలు, న్యూస్ వెలుగు;  మార్చి 8న జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి పి. శ్రావణి రెడ్డి,నగర కార్యదర్శి వి.భారతి తెలిపారు. శుక్రవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో ఏపీ మహిళా సమాఖ్య నగర ఆఫీస్ బేరర్స్ సమావేశం నగర అధ్యక్షురాలు నాగేంద్రమ్మ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మహిళలు వివిధ రంగాల్లో దినదినాభివృద్ధి చెందుతున్నారని, పాలకులు మరింత మహిళల అభివృద్ధికి పెద్దపీట వేసేందుకు కృషి చేయాలని అన్నారు. కేవలం వంటింటికే పరిమితం చేసే భావాజాలాన్ని తిప్పి కొట్టి, ఇతర దేశాలతో సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో ఉండే మహిళలు దూసుకెళ్తున్నారని, అదేవిధంగా అంతర్జాతీయ క్రీడాలైన క్రికెట్,బాక్సింగ్, టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్ లాంటి క్రీడాల్లో గొప్ప గొప్ప పతకాలను సాధించడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా అంతరిక్షంలోకి ఎగురుతున్న రాకెట్లను పంపించే సైన్స్ లో భాగమై, వాటితోపాటు ఇతర గ్రహాల్లోకి ప్రవేశిస్తున్నారని, ఇది గర్వించదగ్గ అంశం అని అన్నారు. అదేవిధంగా రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా, మహిళలను అభివృద్ధి పదంలో పాలకులు నడిపించాలని వారు అన్నారు. దేశంలో,రాష్ట్రంలో మహిళలపై విపరీతంగా దాడులు పెరిగాయని, దాడులను అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. మణిపూర్ రాష్ట్రంలో మహిళలను నగ్నంగా ఊరేగించినప్పటికీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లు ఏమాత్రం కూడా స్పందించడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రేమోన్మాదుల చేతిలో మహిళలు బలైతున్నప్పటికీ కూడా అధికారపక్షంలో ఉన్న టీడీపీ ఏమాత్రం కూడా చర్యలు తీసుకోకుండా, అనేక కేసులను నీరుగారుస్తుందని విమర్శించారు. మహిళల హక్కులను గుర్తు చేసుకునేందుకు మార్చి 8వ తేదీన జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ నగర కార్యదర్శి పి రామకృష్ణారెడ్డి, ఏపీ మహిళా సమాఖ్య నగర ఆఫీస్ బేరర్స్ పావని,సుధాదేవి,అంజలి,ఆశ బేగం,వెంకటేశ్వరమ్మ,మునెమ్మ,సువర్ణ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!