ఔషదాలపై జీఎస్టీ ని తగ్గించిన కేంద్రం

ఔషదాలపై జీఎస్టీ ని తగ్గించిన కేంద్రం

ఢిల్లీ : కేన్సర్‌ ఔషధాలపై గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ (జీఎస్‌టీ)ని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయించింది. నిన్న ఢిల్లీలో జరిగిన 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా పాల్గొన్నారు.

న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన శ్రీమతి సీతారామన్, క్యాన్సర్ చికిత్సకు అయ్యే ఖర్చును తగ్గించేందుకే క్యాన్సర్ ఔషధాలపై జీఎస్టీ రేటును తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఎంపిక చేసిన స్నాక్స్‌పై జీఎస్టీని కూడా 18% నుంచి 12%కి తగ్గించినట్లు ఆమె తెలిపారు

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS