
సూపర్ సిక్స్ ను అమలు చేయలేక చంద్రబాబు చేస్తున్న నటన కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలిసిందే
ఎస్ వి మోహన్ రెడ్డి వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు
కర్నూలు, న్యూస్ వెలుగు; మాజీ ఎమ్మెల్యే కర్నూలు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు ఎస్ వి మోహన్ రెడ్డి స్థానిక ఎస్ వి కాంప్లెక్స్ లో వైఎస్ఆర్సిపి నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్ చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అని ప్రజలను భ్రమల్లోకి తీసుకెళ్లి ఎన్నికలు ముగిసిన వెంటనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదని చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని పథకాల అమలు చేయలేమని చెబుతూ ఒక బ్రహ్మాండమైన నటుడిని మించి నటన చేస్తున్నాడని ఈ నటనకు తప్పనిసరిగా ఆస్కార్ అవార్డు ఇవ్వవలసి ఉంటుందని అన్నారు. రైతులకు నిరుద్యోగులకు చదువుకునే పిల్లలకు అందరికీ సాధ్యం కానీ అమలుకు నోచుకుని వాగ్దానాలు చేసి నేడు రాష్ట్ర ఆర్థిక స్థితి సరిగ్గా లేదని నాటకాలు ఆడుతున్నారని దీన్ని విజ్ఞులైన ప్రజలు గమనిస్తున్నారని త్వరలోనే చంద్రబాబు నాయుడు ప్రజాగ్రహం అంటే ఏమిటో తెలుస్తుంది అని తెలిపారు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పురందరేశ్వరి 12 లక్షల కోట్ల అప్పు ఉందని కేంద్రానికి తెలిపారని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ త్వరలోనే శ్రీలంకలా మారుతుందని తప్పుడు ప్రకటన చేసి తన చేతకానితనాన్ని నిరూపించుకున్నారని మండి పడ్డారు జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ దాదాపు 15 వేల కోట్ల మూలధన వ్యయం చేసారు అని కూటమి ప్రభుత్వం ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా అమలు చేయకుండా కేవలం 13 వేల కోట్లు మూలధన న వ్యయం చేశారని తీవ్రంగా తప్పు పట్టారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు పాల్గొన్నారు.