
రాష్ట్ర అభివృద్దే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం
పుట్టపర్తి , న్యూస్ వెలుగు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చే
యటమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని రాష్ర్ట బి.సి. సంక్షేమం చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు సవితమ్మ తెలిపారు. శుక్రవారం పుట్టపర్తి లోని సాయి ఆరామం లో జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్వర్ణాంధ్ర @ 2024 విజన్ ప్రణాళిక రూపకల్పనపై ఏర్పాటుచేసిన కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పుట్టపర్తి శాసనసభ్యులు పల్లె సింధూర రెడ్డి, కదిరి శాసనసభ్యులు కందికుంట ప్రసాద్, జిల్లా అధికారులు, పలువురు రాజకీయవేత్తలు స్వచ్ఛంద సేవ సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తొలుత ఆంధ్రప్రదేశ్ విజన్ 20 47 పై ప్రణాళిక రూపకల్పనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ శాఖల అధికారులు సాధిస్తున్న ప్రగతి అంశాలను వివరించారు. అనంతరం
మంత్రి మాట్లాడుతూ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన లక్ష్యమని తెలిపారు. అందువల్ల ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా జిల్లా విజన్ ప్లాన్ ను రూపకల్పన చేసి రానున్న 5 సంవత్సరాల లో జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేసే విధంగా ఆయా ప్రభుత్వ శాఖలు కృషి చేయాలని కోరారు. ప్రపంచ చిత్రపటంలోపుట్టపర్తి జిల్లాకు మంచి గుర్తింపు ఉందని, జిల్లాలో అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు పాటుపడాలన్నారు.
పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూర రెడ్డి మాట్లాడుతూ అట్టడుగు స్థాయి వ్యక్తి జీవితాన్ని మార్చేలా ప్రభుత్వ విజన్ ఉండాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్యేయమని అన్నారు. జిల్లాతో పాటు రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెంద దిశగా కొత్త టెక్నాలజీని అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 20 47 ప్రణాళికను రూపొందించాలన్నారు. జిల్లా అభివృద్ధికి అన్ని విధాల సహకారాలు అందిస్తామని పుట్టపర్తి నియోజకవర్గం అభివృద్ధికి తాను కూడా కొన్ని ప్రతిపాదనలో ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు.
కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ మాట్లాడుతూ విజన్ ఉన్న గొప్ప ప్రజానాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. గతంలో ముందస్తు ఆలోచనలతో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పరచడం జరిగిందని గుర్తు చేశారు. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా 2047 నాటి ఆంధ్రప్రదేశ్ కోసం విజన్, ఆర్థికాభివృద్ధికి కీలకరంగాలు జీవన ప్రమాణాల పెంపు, సుస్థిర పర్యావరణానుకూల వృద్ధి ,భవిష్యత్ నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు, పాలన మెరుగుపరచడం, మహిళా సాధికారత ,రైతులు, బలహీన వర్గాల ఆకాంక్షలు తదితర అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూర దృష్టితో విజన్ ఆంధ్ర @2047 తీసుకురావడం జరిగిందన్నారు. ప్రతి జిల్లాలోని కీలక రంగాలపైన దృష్టి సారించి జిల్లా అభివృద్ధి ప్రణాళికను రూపొందించాలన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా జిల్లా విజన్ ప్లాన్ రూపకల్పన చేసుకుని.. రానున్న ఐదు సంవత్సరాల (2024-25 నుండి 2028-29)లో జిల్లాను అన్ని అభివృద్ధి చేసే విధంగా ఆయా శాఖలు మండల మండలన స్థాయిలో విజన్ ప్లాన్ కోసం ప్రణాళికలు రూపొందించుకుని.. లక్ష్య సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.ముఖ్యంగా ప్రభుత్వ శాఖ అధికారులు ఏడాదికి 15% వృద్ధిరేటును నిర్దేశించుకోవాలన్నారు. వ్యవసాయం, ఉద్యాన పంటలు, పారిశ్రామిక వాడల అభివృద్ధి, టూరిజం తదితర అంశాలపై దృష్టిని సాధించాలన్నారు. జిల్లాను అన్ని విధాల ప్రగతి పథంలో నడిపించేందుకు నిర్దేశించుకున్న లక్ష సాధన కోసం ప్రతి ఒక్కరూ సమన్వయ సహకారాలతో పనిచేయాలన్నారు. జిల్లా విజన్ ప్రణాళికలో ప్రజలు,విద్యార్థులు, యువత భాగస్వామ్యం కావాలని కలెక్టర్ కోరారు.
అనంతరం సమావేశానికి హాజరైన ధర్మవరం చెందిన లక్ష్మీనారాయణ రెడ్డి అని రైతు, ధర్మవరం కు చెందిన చేనేత వారు రవిశంకర్ ప్రసాద్, పట్టు చీరల వ్యాపారస్తుల సంఘ మాజీ అధ్యక్షుడు పార్థసారథి, రాంప్రసాద్, భానుజా, పకృతి వ్యవసాయం సంబంధించిన రైతులు, ఇండస్ట్రియల్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వారి వారి సలహాలు సూచనలు జిల్లా కలెక్టర్ వారికి తెలియజేశారు.
వ్యవసాయ అనుబంధ రంగాల, మరియు పారిశ్రామిక రంగానికి సంబంధించిన, అధికారులు పవర్ ప్రజెంటేషన్ కార్యక్రమం ద్వారా నివేదికలు సమర్పించారు
ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని శాఖలు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.