
క్రీడా భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణ : రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన క్రీడా భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. బ్యాట్మింటన్, టేబుల్ టెన్నిస్ వంటి క్రీడా వసతులతో పాటు అధునాతన జిమ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి సీఎం కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు. ఈ కార్యక్రమంలో డీజీపీ జితేందర్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!