జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ ఇవ్వాలి

జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ ఇవ్వాలి

జేసీ డాక్టర్ నవ్యను కలసి వినతి పత్రం అందజేసిన ఏపీయూడబ్ల్యూజే నేతలు

న్యూస్ వెలుగు, కర్నూలు; కర్నూలు జిల్లాలో వివిధ పత్రికలు, చానల్స్ లో పని చేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు 60 శాతం ఫీజు రాయితీ ఇవ్వాలని ఇండియన్ జర్నలిస్టు యూనియన్(ఐజేయూ) జాతీయ సమితి సభ్యులు జీ కొండప్ప, కే నాగరాజు ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎన్ వీ సుబ్బయ్య, జిల్లా అధ్యక్షుడు ఈ.ఎన్.రాజు, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ నాయకులు హరికిషన్, సురేష్, సుంకన్న, ఖలీల్, ఏపీయూడబ్ల్యూజే జిల్లా సహాయ కార్యదర్శులు శివ, అవినాష్ జేసీ డాక్టర్ నవ్య ను కోరారు. సోమవారం ప్రజా ఫిర్యాదుల స్వీకరణలో జేసీని కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు జేసీ తో మాట్లాడుతూ… కర్నూలు జిల్లాలో సుమారు 400 మందికి పైగా జర్నలిస్టులు వివిధ పత్రికలు, చానల్స్ లో పని చేస్తున్నారన్నారు. అయితే చాలా మంది జర్నలిస్టులు చాలీ చాలని వేతనాలతో జీవనం కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులు ఉన్న సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, అన్యాయాలు, సమస్యలను ఎప్పటికప్పుడు పాలకులు, అధికారుల దృష్టికి తీసుకువస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో తమ పిల్లలకు సరైన విద్యను అందించలేని పరిస్థితి ఏర్పడుతోందని చెప్పారు. గతంలో ఉన్న కలెక్టర్లు జర్నలిస్టులకు ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ లో చదివే జర్నలిస్టుల పిల్లలకు మొత్తం ఫీజులో 60 శాతం రాయితీ ఇవ్వాలని గతంలో పనిచేసిన కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారన్నారు. అయితే ఈ సారి సర్క్యూలర్ జారీ చేయకపోవడం తో జిల్లాలో కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ ఫీజు రాయితీ ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అనేక జిల్లాలు జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ లో ఉచిత విద్య, సగం ఫీజు రాయితీ ఇవ్వాలని సర్క్యులర్లు ఇవ్వడం జరిగిందన్నారు. కర్నూలు జిల్లాలో మాత్రం ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా జర్నలిస్టుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మొత్తం ఫీజులు 60 శాతం ఫీజు రాయితీ ఇచ్చే విధంగా సర్క్యులర్ ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన జేసీ డీఈఓ సామ్యూల్ పాల్ ను పిలిచి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని సూచించారు. దీనిపైన స్పందించిన డీఈఓ వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ లభించే విధంగా సర్క్యులర్ ఇస్తామని చెప్పారు. జేసీ ని కలసిన వారిలో ఎమ్మిగనూరు తాలూకా అధ్యకుడు శ్రీనివాస్ నాయుడు, నాయకులు రామయ్య, భాస్కర్, మురళీ, రంగ, మల్లికార్జున, చాంద్, గంగాధర్, ఫోటో గ్రాఫర్ రఫీ, కెమెరామెన్లు రాజు, రఫీ, బాబు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!