పౌర గుర్తింపు సర్వే వేగవంతం చేయాలి

పౌర గుర్తింపు సర్వే వేగవంతం చేయాలి

  నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు

కర్నూలు, న్యూస్ వెలుగు; నగర వ్యాప్తంగా పౌర గుర్తింపు సర్వే వేగవంతం చేయాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు సచివాలయ కార్యదర్శులను ఆదేశించారు. గురువారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక ‌సమావేశ భవనంలో సచివాలయ కార్యదర్శులతో సర్వే పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఇప్పటికి 80,553 మంది పౌరులు ప్రభుత్వ రికార్డుల్లో లేరని, వారిని వెంటనే గుర్తించి ఆయా సచివాలయ పరిధిలో ఉన్నట్లు నిర్ధారించాలని ఆదేశించారు. ఈ నెలాఖరులోగా సర్వే పూర్తి చేయాలని, జాప్యం చేయకుండా సిబ్బంది పకడ్బందీగా సర్వే నిర్వహించాలని కమిషనర్ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్.జి.వి. క్రిష్ణ, అధికారులు సాదిక్, ఎం.కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!