
పౌర గుర్తింపు సర్వే వేగవంతం చేయాలి
నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు
కర్నూలు, న్యూస్ వెలుగు; నగర వ్యాప్తంగా పౌర గుర్తింపు సర్వే వేగవంతం చేయాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర
 బాబు సచివాలయ కార్యదర్శులను ఆదేశించారు. గురువారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో సచివాలయ కార్యదర్శులతో సర్వే పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఇప్పటికి 80,553 మంది పౌరులు ప్రభుత్వ రికార్డుల్లో లేరని, వారిని వెంటనే గుర్తించి ఆయా సచివాలయ పరిధిలో ఉన్నట్లు నిర్ధారించాలని ఆదేశించారు. ఈ నెలాఖరులోగా సర్వే పూర్తి చేయాలని, జాప్యం చేయకుండా సిబ్బంది పకడ్బందీగా సర్వే నిర్వహించాలని కమిషనర్ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్.జి.వి. క్రిష్ణ, అధికారులు సాదిక్, ఎం.కుమార్ తదితరులు పాల్గొన్నారు.
 బాబు సచివాలయ కార్యదర్శులను ఆదేశించారు. గురువారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో సచివాలయ కార్యదర్శులతో సర్వే పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఇప్పటికి 80,553 మంది పౌరులు ప్రభుత్వ రికార్డుల్లో లేరని, వారిని వెంటనే గుర్తించి ఆయా సచివాలయ పరిధిలో ఉన్నట్లు నిర్ధారించాలని ఆదేశించారు. ఈ నెలాఖరులోగా సర్వే పూర్తి చేయాలని, జాప్యం చేయకుండా సిబ్బంది పకడ్బందీగా సర్వే నిర్వహించాలని కమిషనర్ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్.జి.వి. క్రిష్ణ, అధికారులు సాదిక్, ఎం.కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar