
పరిసరాల శుభ్రత….అందరి బాధ్యత
పరిశుభ్రతతోనే ఆరోగ్యం
స్వచ్చత…శుభ్రత పై ప్రజలు నైతిక బాధ్యత వహించాలి
హోళగుంద, న్యూస్ వెలుగు: ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ప్రతి నెల మూడో శనివారం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలో స్థానిక బస్టాండ్ నందు సర్పంచ్ చలువాది రంగమ్మ అధ్యక్షతన ఎంపిడిఓ విజయలలిత,ఈఓపీఆర్డి చక్రవర్తి,కార్యదర్శి రాజశేఖర్ చెత్త ఊడ్చి శుభ్రపరిచారు.ముందుగా బస్టాండ్ నందు అవగాహన ర్యాలీ నిర్వహించి,మానవ హారం ఏర్పాటు చేసి నినాదాలు చేశారు.అంతేకాకుండా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతి రోజు కొంత సమయంకేటాయిస్తానని తన వంతు కృషిగా స్వచ్చత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటామని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్చత పై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేశారు.అనంతరం చెత్త నుండి సంపద తయారీ కేంద్రానికి చేరుకుని పూజలు చేసి రిబ్బన్ కట్ చేసి పునః ప్రారంభించారు.మరియు చెత్త నుండి సంపద తయారీ కేంద్రంలో కృత్రిమంగా తయారు చేసిన ఎరువును కేజీ రూ
10/- చొప్పున రైతులకు విక్రయించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛ ఆంధ్రలో భాగస్వాములై గ్రామ పరిశుభ్రతలో ప్రజలందరూ సహకరించాలని కోరారు.అలాగే గ్రామాన్ని పారిశుధ్య రహిత గ్రామంగా తీర్చిదిద్దుకుందామని దానికి ప్రజల సహకారం కావాలన్నారు.