
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు సీఎం చంద్రబాబు
అమరావతి, న్యూస్ వెలుగు; ఇంద్రకీలాద్రిపై కొలువైఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అక్టోబర్ 3వ తేదీ నుండి జరగనున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఈవో కె ఎస్ రామరావు గ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబును వేదపండితులు ఆశీర్వదించి, అమ్మవారి ప్రసాదం, చిత్రపటం ను అందించారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Mahesh Goud Journalist
 Mahesh Goud Journalist