కన్నయ్యనాయుడుని సన్మానించిన  సీఎం చంద్రబాబు

కన్నయ్యనాయుడుని సన్మానించిన సీఎం చంద్రబాబు

అమరావతి : ప్రముఖ సాగునీటి రంగ నిపుణులు, రిటైర్డ్ అధికారి కన్నయ్య నాయుడు ని ముఖ్యమంత్రి చంద్రబాబు సన్మానించారు. వెలగపూడి సచివాలయంలో కన్నయ్యనాయుడుకి శాలువా కప్పి జ్ఞాపిక అందించి అభినందించారు. వరద పోటుతో ఇటీవల తుంగభద్ర జలాశయం 19వ గేటు కొట్టుకుపోయింది. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు  సమస్యను పరిష్కరించేందుకు కన్నయ్య నాయుడికి ఫోన్ చేసి అక్కడకు వెళ్లాలని కోరారు. పరిస్థితిని గాడిన పెట్టేందుకు ఎంతో శ్రమించిన కన్నయ్య నాయుడు వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలోనే ఏపీ, కర్నాటక అధికారుల సహకారంతో స్టాప్ లాగ్ గేటు విజయవంతంగా అమర్చారు. దీంతో సుమారు 30 టీఎంసీల నీరు వృధా కాకుండా అడ్డుకోగలిగారని దీని వల్ల ప్రమాదాన్ని , రైతుల ఆశలకు ఊతం ఇచ్చారన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!