ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సీఎం రేవంత్  సమీక్ష

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సీఎం రేవంత్ సమీక్ష

హైదరాబాద్, న్యూస్ వెలుగు; ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సచివాలయంలో మంత్రులు , సీఎం సలహాదారు , తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి , ఇతర ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు.ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న కింద ఇత‌ర రాష్ట్రాలకు ల‌క్ష‌ల సంఖ్య‌లో ఇళ్లు మంజూరు అవుతుంటే, తెలంగాణకు ఎందుకు ఆ స్థాయిలో కేటాయింపులు జరగడం లేదని అధికారులను ప్రశ్నించారు. కేంద్రం మంజూరు చేసే గృహాల్లో ఈసారి రాష్ట్రానికి గ‌రిష్ట సంఖ్య‌లో సాధించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు.ఇళ్ల విషయంలో కేంద్రానికి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని, డేటాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు.రాజీవ్ స్వగృహలో నిర్మించి ఏళ్ల తరబడి వృథాగా ఉన్న బ్లాక్‌లు, ఇళ్లు వేలం వేయాల‌ని ముఖ్య‌మంత్రి గారు అధికారుల‌కు సూచించారు.డ‌బుల్ బెడ్రూమ్ ఇళ్ల ల‌బ్ధిదారుల ఎంపిక పూర్త‌యినా వాటిని ఎందుకు అప్ప‌గించ‌కపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హుల‌కు ఆ ఇళ్ల‌ను అప్ప‌గించాల‌న్నారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో నిర్మించి నిరుప‌యోగంగా ఉన్న బ్లాక్‌ల‌కు మౌలిక వ‌స‌తులు క‌ల్పించి, అర్హులైన ల‌బ్ధిదారుల‌కు అప్ప‌గించాల‌ని చెప్పారు.

Author

Was this helpful?

Thanks for your feedback!