
కళాశాల ఆవరణలో పిచ్చి మొక్కలు తొలగించిన కళాశాల సిబ్బంది
బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు: మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో పిచ్చి మొక్కలు పెరిగి విద్యార్థులు కళాశాలకు రావడానికి గ్రౌండ్లో ఆటలు ఆడుకోవడానికి ఇబ్బందికరంగా ఉందని గ్రహించిన కళాశాల అధ్యాపకులు తమ సొంత నిధులతో వాటిని తొలగించి గ్రౌండ్ మొత్తాన్ని డోజర్ సహాయంతో చదును చేశారు. బండి ఆత్మకూర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ వెంకటనారాయణ 5000 రూపాయలు అధ్యాపకులు రఘునాథరెడ్డి నజరుద్దీన్ రామసుబ్బారెడ్డి ఐదువేల రూపాయలు ఇచ్చారని ప్రిన్సిపల్ తెలిపారు. కార్యక్రమంలో సురేష్ షబ్బీర్ పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!