కమ్యూనిస్టు మహా యోధుడు కామ్రేడ్ జ్యోతిబాసు : డి గౌస్ దేశాయ్

కమ్యూనిస్టు మహా యోధుడు కామ్రేడ్ జ్యోతిబాసు : డి గౌస్ దేశాయ్

   కమ్యూనిస్టు పార్టీ ఉద్యమనేత, తుదిశ్వాసవదిలేవరకుఓటమి మెరుగని నేత 

కర్నూలు, న్యూస్ వెలుగు;  కర్నూల్ సిపిఎం పార్టీ న్యూ సిటీ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ జ్యోతి బాసు 15వ వర్ధంతికార్యక్రమం కర్నూలు కార్మిక కర్షక భవన్ నందు ఉదయం10గంటలకుజరిగింది. ఈకార్యక్రమానికి సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు సి.హెచ్ సాయిబాబా అధ్యక్షత జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి డి. గౌస్ దేశాయ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుఎం. నారాయణ, నగర కార్యదర్శివర్గసభ్యులుఆర్.నరసింహులు గారులు కామ్రేడ్ జ్యోతిబాసు గారి చిత్రపటానికి పూలమాలవేసినివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ జ్యోతిబాసుగారుఉన్నతకుటుంబంలో జన్మించి, లండన్ లో ఉన్నత చదువులు పూర్తి చేసుకుని, మార్క్సిస్టు భావాలకు ఆకర్షితుడై కమ్యూనిజం అజేయమని నమ్మి ఓటమి ఎరుగని నాయకుడిగా కమ్యూనిస్టు ఉద్యమ నేతగా, కార్మిక కష్టజీవుల నాయకుడిగా అలుపెరుగని పోరాటం చేసిన మహా యోధుడు, ప్రపంచంలో రష్యా, చైనా కమ్యూనిజాన్ని ఏ విధంగా ప్రపంచం చూసిందో ఆ విధంగా పశ్చిమ బెంగాల్లో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ అంటే ఇలాఉంటుందనితెలియజేసిబెంగాల్లో తిరుగులేని పార్టీని నిర్మించిన మహా నాయకుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించి వామపక్ష ప్రభుత్వాన్నిపడగొట్టినసందర్భంలోతిరిగి బెంగాల్లో ఎన్నికలు జరిగితే కమ్యూనిస్టు పార్టీకి తిరుగులేని విజయంసాధించిపెట్టి ఇందిరా గాంధీకి సైతంముచ్చెమటలు పట్టించిన కమ్యూనిస్టు యోధుడు. రాజకీయ ఎత్తుగడలు చిత్తు చేయడంలో మహా జ్ఞాని, ప్రజలే నా బిడ్డలుగా భావించి, తన కుమారుని బడిలో చేర్పించిన సందర్భంలో తండ్రిగా తన పేరు నమోదు చేయకుండా గార్డియన్ పేరు నమోదు చేయించి ప్రజలందరికీ తండ్రిగా నిలిచాడు. పశ్చిమ బెంగాల్లో 35 సంవత్సరాలు ఎర్రజెండా రెపరెపలు ఎగరవేస్తూ కమ్యూనిస్టు పరిపాలన ఎలా ఉంటుందో చూపించాడు. భారతదేశంలో పేదలకు పంచిన భూమి ఎంత ఉందో అంత భూమిని ఒక్క బెంగాల్ రాష్ట్రంలోనే లక్షలాది ఎకరాలుభూమిని పంచి చరిత్ర సృష్టించాడు . 2010సంవత్సరంలో ఆయన మరణించినప్పుడు నా శరీరం వృధా కాకూడదు అని భావించివైద్యులకు పరీక్షలకు ఉపయోగపడే విధంగా తన అవయవాలన్నీ వైద్య పరీక్షల కోసం హాస్పిటల్ కు రాసి ఇచ్చినత్యాగశీలి మహా నేత జ్యోతిబాసు గారు మార్క్సిజం అజేయమని ఆయన చూపిన మార్గంలో పయనించి ఆయన అడుగుజాడల్లో పయనించినప్పుడే ఆయనకు ఘనమైన నివాళి అర్పించిన వారం అవుతామని వారు అన్నారు. సిపిఎంజిల్లా కమిటీ సభ్యులు సి.గురుశేఖర్, ఎం. నగేష్, ఓల్డ్ సిటీ నగర కార్యదర్శి ఎం.రాజశేఖర్ నగరకార్యదర్శివర్గసభ్యులుకే.సుధాకరప్ప, కే.ప్రభాకర్,నగరనాయకులు ఎస్ఎండి మహమ్మద్ రఫీ, M.ఏసు, శ్రీనివాసులు, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర, ఆటో యూనియన్ నగర అధ్యక్షులు ఎస్.హుస్సేన్ వలి, షంషీర్, చిన్న మద్దిలేటి, విష్ణుమూర్తి, దేవరాజు, నరసింహ మొదలగు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS