
రాష్ట్ర స్థాయి నెట్ బాల్ పోటీలను జయప్రదం చేయండి
న్యూస్ వెలుగు, కర్నూలు; ఈ నెల 21 నుంచి 22 వరకు కర్నూలు లో నిర్వహిస్తున్న 10 వ రాష్ట్ర స్థాయీ సబ్ జూనియర్ నెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలను విజయవంతం చేయలని కర్నులు జిల్లా నెట్బాల్ సంఘం వ్యవస్థాపకులు కె.నాగరత్నమయ్య, అధ్యక్షులు బి.నాగేశ్వరబాబు కోరారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మౌర్య ఇన్ లో విలేకరులతో మాట్లాడారు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్డ్ స్టేడియంలో నిర్వహించే నెట్బాల్ పోటోల్లో జిల్లాల నుంచి నాలుగు వందలకు పైగా క్రీడాకారులు పోటీలలో పాల్గొంటారని వారు తెలిపారు.చెన్నైలో 28 నా జరిగే జాతీయ స్థాయి నెట్బాల్ ఛాంపియన్షిప్ పోటిలకు ఎంపిక చేస్తాము అని వారు చెప్పారు. కర్నూలు జిల్లా నెట్బాల్ సంఘం కార్యదర్శి వంశీ కృష్ణ,కోచ్ చరణ్, రాజశేఖర్,సంఘం ఉపాధ్యక్షము సూర్యను మార్, గీతా, సుప్రియ తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!