
కల్లూరు లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
న్యూస్ వెలుగు, కర్నూలు; డాక్టర్ బీఆర్. అంబేద్కర్ ను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ కర్నూలు సిటీ అధ్యక్షుడు పాముల కుమార్ తెలిపారు. కర్నూలు లోని కల్లూరు వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ దినోత్సవం వేడుకలు ఎమ్మార్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత ను వివరించారు. పాముల కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా నే ప్రతి ఒక్కరు సమాన హాక్కులతో జీవిస్తున్నారని తెలిపారు. పాఠ్యపుస్తకాల్లో అంబేద్కర్ జీవిత చరిత్ర ను చేరాస్తే విద్యార్థుల కు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని కుమార్ తెలిపారు. రాజ్యాంగం ద్వారానే మనకు ఓటు హాక్కు, విద్యా హక్కు వచ్చిందన్నారు. ఈకార్యక్రమంలో పాముల కుమార్, వెంకటేశ్వర్లు,ఇంద్రకుమార్, గిడ్డయ్య, క్రిష్ణ, దాస్,లింగన్న తదితరులు పాల్గొన్నారు.