
అటవీ ప్రాంత సంరక్షణకై కంచెలు ఏర్పాటు ; డిఆర్ఓ రామచంద్రుడు
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: అటవీ ప్రాంతంలోని గల చెట్లు,జంతువులు అటవీ సంబంధిత సంపద సంరక్షణ కొరకు అటవీ ప్రాంత సరిహద్దులలో కంచెలను ఏర్పాటు చేస్తున్నట్లు డిఆర్ఓ రామచంద్రుడు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంప పథకం ద్వారా మండల పరిధిలోని రాతన ప్రాంత సరిహద్దులలో గల పది హెక్టార్ల అటవీ ప్రాంతంలో 11,400 మొక్కలను నాటి 8.13 లక్షల నిధులతో 600 రన్నింగ్ మీటర్స్ కంచెను ఏర్పాటు చేశామని ఆయన తెలియజేశారు.అదేవిధంగా తుగ్గలిలోని గల కిష్టాపురం అటవి ప్రాంతం నందు 14,000 మొక్కలను నాటి వాటి సంరక్షణ కొరకు 20 లక్షల నిధులతో 1400 రన్నింగ్ మీటర్ల ఇనుప కంచ పనులను ప్రారంభించినట్లు డిఆర్ఓ రామచంద్రుడు తెలియజేశారు. అటవీ ప్రాంత సంపద పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తుగ్గలి బీట్ ఫారెస్ట్ ఆఫీసర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!