
పత్తి పంట కొనుగోలు కేంద్రాలు పునః ప్రారంభించాలి
పత్తి పంటకు క్వింటాలుకు పదివేల రూపాయలు ఇవ్వాలి
ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ డిమాండ్
కర్నూలు, న్యూస్ వెలుగు; పత్తి పంట కొనుగోలు కేంద్రాలను తిరిగి ప్రారంభించాలని క్వింటాలుకు పదివేల రూపాయలు తక్కువ కాకుండా రైతులకు ఇవ్వాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఏ కృష్ణ గూడూరు మండలం అధ్యక్షులు కృష్ణారెడ్డి తదితరులు డిమాండ్ చేశారు. సోమవారం ప్రజా దర్బారులో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష ను కలిసి రైతు సంఘం నాయకులు వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా జి రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు పైగా పత్తి పంట సాగు అయిందని దిగుబడి కూడా ఈ సంవత్సరం కొంత మెరుగైందని ఎనిమిది క్వింటాళ్ల నుండి 12 13 14 క్వింటాళ్లు ఎకరాకు వచ్చాయని ఆయన తెలిపారు దిగుబడి వచ్చినప్పటికీ ధర లేకపోవడం వలన రైతులు పెట్టిన పెట్టుబడిదాకా అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఖరీఫ్లో పండిన పంట నవంబర్ మాసం వరకు పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆదోని మంత్రాలయం ఎమ్మిగనూరు కోడుమూరు మండలాలలో సుమారుగా 12 కేంద్రాలలో ఏర్పాటుచేసి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా రైతుల నుండి పత్తి కొనుగోలు చేశారు కానీ ఉన్నట్లుండి నవంబర్ మాసం చివర్లో పత్తి కొనుగోలు కేంద్రాలు మూసివేశారు ఫలితంగా రైతులు లబోదిబోమంటున్నారు రైతులకు సమాచారం ఇవ్వకుండా ఎందుకు కొనుగోలు కేంద్రాలు మూసివేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికీ కర్నూలు జిల్లాలో 50 వేల క్వింటాళ్ల వరకు రైతుల దగ్గర నిలువ ఉన్నాయని ,ప్రారంభంలో తీసిన పత్తి ఇప్పటికీ రైతుల దగ్గర ఉన్నదని వాటిని కొనుగోలు చేయకపోతే రైతులు అమాంతం నష్టపోయే పరిస్థితి ఉందని కావున కలెక్టర్ గారు తక్షణమే జోక్యం చేసుకోవాలి కొనుగోలు కేంద్రాలను తిరిగి ప్రారంభించి పూర్తి పత్తిని కొనుగోలు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు కలెక్టర్ రంజిత్ భాష సానుకూలంగా స్పందిస్తూ తక్షణమే మార్కెటింగ్ వారు సిసిఐ వారితో కోఆర్డినేషన్ చేసుకొని తిరిగి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రంజిత్ భాష అదేచించారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కే మధు రైతులు సీతా రాముడు శివన్నా ఆంజనేయులు షేక్షావలి ఇంకా అనేక మంది రైతులు పాల్గొన్నారు.