దేవతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన

దేవతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన

హొళగుంద, న్యూస్ వెలుగు; హొళగుంద మండలం సమ్మతగేరి గ్రామంలో దేవ

తామూర్తి కొరువంజమ్మ అవ్వ నూతన ఆలయ ప్రారంభోత్సవం,నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది.జలాభిషేకం,ధాన్యాభిషేకం,హోమాలు,యజ్ఞాలు,వాస్తు పూజలు,ఇతర పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించి జె వసళ్లి మఠం పీఠాధిపతులు శంభులింగ స్వామి చేతుల మీదుగా విగ్రహానికి ప్రాణం అనే శక్తిని ప్రత్యేక పూజల ద్వారా ఆవాహన చేశారు.అనంతరం గ్రామస్తులంత ధూపదీపాధి,నైవేద్యాలు సమర్పించుకుని ఆడపడుచులకు ఉడిబియ్యం పోశారు.ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులంతా భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!