పాతబడిన నీళ్ల ట్యాంక్ కూల్చివేత

పాతబడిన నీళ్ల ట్యాంక్ కూల్చివేత

హోళగుంద,న్యూస్ వెలుగు:మండల పరిధిలోని కోగిలతోట గ్రామంలో ఆదివారం ఎంపీయుపి స్కూల్ ఆవరణంలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న నీళ్ల ట్యాంకు పాతబడి పోవడంతో అది ఏ సమయంలోనైనా….ఎప్పుడైనా కూలిపోయి అక్కడున్న విద్యార్థుల ప్రాణాలు బలి కావచ్చు…అందువలన దీనిని ముందుగానే గ్రహించిన ఎస్ఎంసి కమిటీ చైర్మన్,వైస్ చైర్మన్  కమిటీ సభ్యులు దీనిని ఎలాగైనా స్కూల్ ఆవరణం నుంచి తొలగించాలని జిల్లా కలెక్టర్కు అర్జీ పెట్టుకోవడం జరిగింది.ఇందుకు స్పందించిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్ భాష వెంటనే ఆ నీళ్ల ట్యాంకును తొలగించవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు.దీంతో అక్కడున్న ఆ నీళ్ల ట్యాంకును గ్రామ పంచాయతీ సెక్రెటరీ నాగరాజు,గ్రామ సర్పంచ్ నాగప్ప నాయుడు,మరియు ఎస్ఎంసి చైర్మన్ బసవరాజు తొలగించారు.

Was this helpful?

Thanks for your feedback!