పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన డిఈఓ

పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన డిఈఓ

హోళగుంద, న్యూస్:మండల కేంద్రంలో జరుగుతున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాలను సోమవారం జిల్లా విద్యాధికారి శ్యామూల్ పాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలు పకడ్బందీగా జరుతున్నట్లు తెలియజేశారు.అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏ సెంటర్ నందు 208 మంది విద్యార్థులకుగాను 199,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బి సెంటర్ నందు 214 మంది విద్యార్థులకు గాను 206 మంది విద్యార్థులు,జూనియర్ కళాశాల నందు 178 మంది విద్యార్థులకు గాను 173 మంది విద్యార్థులు,కేజీబీవి పాఠశాల నందు 118 మంది విద్యార్థులకు గాను 112 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని చెప్పారు.అదేవిధంగా నిరుపయోగంగా ఉన్న ఎస్సి హాస్టల్ ను పునరుద్ధరించాలని గ్రామస్థులు డిఈఓను కోరారు. ఎంఈఓ లుసత్యనారాయణ జగన్నాథ ఉన్నారు

Authors

Was this helpful?

Thanks for your feedback!