కూటమి ప్రభుత్వంలో బీసీల అభివృద్ధి..

కూటమి ప్రభుత్వంలో బీసీల అభివృద్ధి..

  నాయి బ్రాహ్మణ కార్పోరేషన్ రాష్ట్ర చైర్మన్. రుద్రకోటి సదాశివ

కర్నూలు, న్యూస్ వెలుగు; తెలుగు దేశం పార్టీ లోనే బీసీలకు అభివృద్ధి ఫలాలు అందుతాయని ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివ కర్నూలు లో అన్నారు. త్యాగరాజు జయంతి సందర్భంగా ఆయన కర్నూలు పర్యటనకు వచ్చి నగరంలోని ఓహోటల్లో నాయి బ్రాహ్మణ సంఘల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ హాయంలో నాయి బ్రాహ్మణులకు ఫెడరేషన్ ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫెడరేషన్ ను కార్పోరేషన్ గా మార్చి రుణాలు ఇచ్చారన్నారు.90 శాతం సబ్సిడీ తో పనిముట్లు ఇచ్చారన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి 52 కార్పోరేషన్లు ఏర్పాటు చేసి ఒక్కరూపాయి నిధులు కేటాయించలేదన్నారు. అధికార పదవులు వారి సామాజిక వర్గానికి ఇచ్చి అలంకార పదవులు బీసీలకు ఇచ్చారని సదాశివ విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలకమైన పదవులను బీసీలకు కేటాయించారని తెలిపారు. ఈకార్యక్రమంలో సదాశివ తో పాటు కార్పోరేషన్ డైరెక్టర్ విజయ్ కుమార్, పెద్ద స్వాములు, పర్ల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!