
అమ్మవారి, స్వామి వారి దర్శనార్థం విశేషముగా విచ్చేసిన భక్తులు..
విజయవాడ,న్యూస్ వెలుగు ; శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం లో ఆదివారం సందర్బంగా ఉదయం నుండి శ్రీ సంకట హర గణపతి హోమం నందు 14 ఉభయదాతలు, నిత్య ఆర్జిత సేవలైన శ్రీ అమ్మవారి ఖడ్గమాలర్చన నందు 17 ఉభయదాతలు, చండీ హోమం నందు 98 ఉభయదాతలు, లక్ష కుంకుమార్చన నందు 31 ఉభయదాతలు, శ్రీ చక్రార్చన సేవ నందు 9 ఉభయదాతలు, సూర్యోపాసన సేవలో 6 ఉభయదాతలు, వేదాశీర్వచనం 25 మంది, పంచహారతులలో 21 మంది మరియు ఇతర సేవలలో కలిపి మొత్తం 350 పైగా ఉభయదాతలు ఆలయ ప్రత్యక్ష మరియు పరోక్ష సేవలలో పాల్గొన్నారు.
రద్దీ దృష్ట్యా దేవస్థానం వారు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.
Was this helpful?
Thanks for your feedback!