
ధనాపురం-హోళగుంద రోడ్డు సమస్య పరిష్కరించాలి
హోళగుంద, న్యూస్ వెలుగు: ధనాపురం-హోళగుంద రోడ్డు సమస్య పరిష్కరించాలని శుక్రవారం ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథికి వినతి పత్రం సమర్పించారు.అనంతరం ఆర్ అండ్ బి ఈఈని కలిసి రోడ్డు వేయకపోవడం ఏమిటని వివరణ కోరగా గతంలో ఇచ్చిన కాంటాక్ట్ వర్కను రద్దు చేయడం జరిగిందని మరియు తిరిగి కొత్తగా టెండర్లు పిలవడం జరిగిందని త్వరలోనే రోడ్డు పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు.తదనంతరం పంచాయతీరాజ్ ఈఈని కలిసి గెజ్జెహళ్లి నుండి వందవాగలి రోడ్డు, కోగిలతోట నుండి గుళ్యం రోడ్డు వేయాలని వినంతి పత్రం సమర్పించారు.ఇందుకు సానుకూలంగా స్పందించి పై అధికారులకు విన్నవించి నిధులు సేకరించి త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు నేషనల్ కౌన్సిల్ మెంబర్ చిదానంద,మాజీ మండల అధ్యక్షుడు ఏఎన్ ప్రసాద్,మండల వైస్ ప్రెసిడెంట్ ఉల్లిగన్న,మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!