వేరుశనగ పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా

వేరుశనగ పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా

కర్నూలు, న్యూస్ వెలుగు; ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో వేరుశనగ పంటను రాష్ట్ర ప్రభుత్వమే క్వింటాం 10 వేల రూపాయలకు కొనుగోలు చేయాలని కర్నూలు మార్కెట్ యార్డులో ఏపీ రైతు సంఘం కర్నూలు జిల్లా సహాయ కార్యదర్శి దంబోళం శ్రీనివాసరావు అధ్యక్ష తన
ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె జగన్నాథ హాజరై మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్లలో వేరుశనగ ధర పూర్తిగా పతనమయింది కావున రాష్ట్ర ప్రభుత్వమే ఆయిల్ పెడ్ ద్వారా క్వింటాం 10 వేల రూపాయలకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు వేరుశనగ ధర పంట రాకముందు ఒక క్వింటం 8 వేల రూపాయలు వరకు ధర పలికిందని రైతులు దగ్గర నుండి పంట మార్కెట్లకి వచ్చేలోగా హఠాత్తుగా 4500 ధర పడిపోయిందని దీనివల్ల వేరుశనగ రైతులు చాలా తీవ్రంగా నష్టపోతున్నారని, ఒక ఎకరం వేరుశెనగ పంట పండించడానికి దాదాపు 60 వేల రూపాయలు ఖర్చు వస్తుందని ఇంత పెట్టుబడిని రైతులు అప్పుచేసి మరి పెడితే పంట పండిన తర్వాత గిట్టుబాటు ధర రాక మరి కొన్నిచోట్ల వ్యాపారస్తులు సిండికేట్ గా ఏర్పడి తక్కువ ధరలకే రైతుల నుండి వేరుశనగ పంట కజేయాలని చూస్తున్నారని దీనివల్ల ఆరుగాలం కష్టపడి పండించిన రైతుకు శ్రమకు తగ్గ ఫలితం రాకుండా తీవ్ర నష్టపోయే ప్రమాదం ఏర్పడుతుందని కావున రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సిండికేట్ గా ఏర్పడిన వ్యాపారులపై చర్యలు తీసుకోవడమే కాకుండా ఆయిల ఫెడ్ ద్వారా వేరుశనగ పంట క్వింటం పదివేల రూపాయలకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని జిల్లాలోని ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి వేరుశనగ రైతుల కష్టాలను తీసుకెళ్లి రైతులను ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు లేనిపక్షంలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులను సమీకరించి వేరుశనగ రైతులను ఆదుకునేంత వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శి సి మహేష్, నగర కార్యవర్గ సభ్యులు నాగరాజు, నగర నాయకులు రాముడు ఆచారి కటర్కొండ బొందిమడుగుల రైతులు మహిళలు
తదితరులు పాల్గొన్నారు

Author

Was this helpful?

Thanks for your feedback!