
జగన్ కు ఈరోజు రోశయ్య గారు గుర్తుకొచ్చారా
కొత్తూరు సత్యనారాయణ గుప్త
న్యూస్ వెలుగు, కర్నూలు; రోశయ్య బ్రతికుండగా గౌరవించని నీవు.. ఈనాడు రోశయ్య నివాళులు అర్పించడం విడ్డూరంగా ఉందని కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కొత్తూరు సత్యనారాయణ గుప్తా విమర్శించారు. గురువారం ఉదయం ఆయన మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ రాజకీయ నాయకులకు పదవి కాంక్ష ఉండడం సహజం ..కానీ ఒకరిని తొక్కి పైకి రావాలి అనుకోవడం భ్రమ అవుతుంది అన్నారు. దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి రోశయ్య పట్ల ఎంతో అభిమానంతో ప్రేమతో ఉండేవారని, కానీ జగన్మోహన్ రెడ్డి రోశయ్య పట్ల వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా వైశ్యులు గుర్తించుకున్నారన్నారు. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం రోశయ్య గారికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే జీర్ణించుకోలేక ఎలా వ్యవహరించావో అందరికీ తెలుసు అన్నారు. రాజకీయ బిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీ ని దూరమై పార్టీని స్థాపించుకొని ముఖ్యమంత్రి అయ్యి నేడు ప్రతిపక్ష హోదాను కూడా పొందులేకపోయావు అన్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఏనాడు కూడా రోశయ్య వర్ధంతిలు జయంతులు జరుపుకొని నీవు ఈరోజు రోశయ్య గుర్తుకు వచ్చారా అని ఆయన ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి విధానాలకు వెళ్లడం నిజమైన నివాళులు కాదన్నారు. కనీసం రోశయ్య గారి విగ్రహాన్ని కూడా అనుమతించకుండా వ్యవహరించిన నీవు ఈరోజు నివాళులర్పించడం నీ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. ఆనాడు మహాత్మా గాంధీని అవమానపరిచిన ఆంగ్లేయ ఉద్యోగి అదే స్ఫూర్తితో ఈ దేశం నుండి తరిమించిన సంఘటన గుర్తు చేసుకో.. మనుషులను గౌరవించడం నేర్చుకో .. ఒక కులాన్ని పెద్దగా ఇంకో కులాన్ని చిన్న చూపుగా చూడటం మానుకో . . సమాజంలో అందరూ సమానమే అని తెలిపారు. ఇప్పటికైనా బీజేపీ ఇస్తున్న మద్దతు విరమించుకొని మంచి వాడే అనిపించుకో . నాడు 151 సీట్లు పొందిన నీవు ఈరోజు 11 స్థానాలకు పరిమితమయ్యావు అంటే మధ్యలో ఉన్న ఐదు హస్తం గుర్తుకు దూరం అయినందుకు నీకు ఈ దుస్థితి పట్టింది అన్నారు. కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి దూరమై రాజకీయాలు చేస్తున్నావ్ అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ఉంటావు అధికారంలో లేనప్పుడు ఇంకోలా ఉంటావు .. ఆనాడు జాతీయ మీడియా నువ్వు గౌరవించావు ఈనాడు స్థానిక మీడియాను గుర్తిస్తున్నావు.. అధికారంలో ఉన్నప్పుడు పాత్రికేయుల సమావేశ నిర్వహించలేదు.. అధికారం కోల్పోయాక పాత్రికేయుల సమావేశం నిర్వహిస్తున్నావు ఏంటి మీ రాజకీయం అని ఆయన ఎద్దేవ చేశారు.