
జిల్లాలోని 2,40,330 పింఛనుదార్లకు రూ.102.55 కోట్ల రూపాయల పంపిణీ
డిసెంబర్ 1 వ తేది ఆదివారం కావడంతో ఒకరోజు ముందే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి సామాజిక భద్రత పెన్షన్లను అందజేసిన జిల్లా కలెక్టర్
కర్నూలు, న్యూస్ వెలుగు: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద జిల్లాలో అర్హులైన 2 లక్షల 40 వేల 330 మంది పెన్షన్ లబ్దిదారులకు రూ.102.55 కోట్లు పంపిణీ చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.శనివారం ఉదయం నగరంలోని జొహరాపురంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అచ్చమ్మ, లచ్చమ్మ లకు వృద్ధాప్య పెన్షన్, ప్రమీలమ్మ కు వితంతువు పెన్షన్, జ్యోతి కి ఒంటరి మహిళ పెన్షన్లను వారి ఇంటి వద్దకే వెళ్లి కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబర్ 1 వ తేది ఆదివారం కావడంతో ఒకరోజు ముందే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు… NTR భరోసా పింఛను పథకం ద్వారా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీపై రాష్ర్ట ప్రభుత్వం కొన్ని నూతన మార్గదర్శకాలు జారీ చేసిందని కలెక్టర్ తెలిపారు.. ఈ మార్గదర్శకాల ప్రకారం పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ యాజమాని మరణిస్తే వెంటనే అతని భార్యకు వితంతు పింఛను మంజూరు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. కుటుంబ యజమాని మరణించిన వెంటనే అందుకు సంబంధించి తగిన డాక్యుమెంట్లు అప్లోడ్ చేస్తే, తదుపరి నెలలో అతని భార్యకు పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.. ఈ ఉత్తర్వులు 01.11.2024 తేదీ తర్వాత మరణించిన వారికి మాత్రమే వర్తిస్తాయని, అర్హులైన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు..అలాగే నూతన మార్గదర్శకాల ప్రకారం మొదటి నెలలో పెన్షన్ తీసుకోకపోయినా, 2వ నెలలో రెండు నెలల పెన్షన్ మొత్తాన్ని కలిపి ఇస్తారని, ఒకవేళ రెండు నెలల పాటు వరుసగా పెన్షన్ తీసుకోకపోయినా, మూడవ నెలలో మూడు నెలల పెన్షన్ మొత్తం కలిపి ఒకేసారి అందజేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు..ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలో కర్నూలు జిల్లా వరుసగా 4 సార్లు విజయవంతంగా మొదటి స్థానంలో నిలిచిందని, ఈ సారి కూడా జిల్లా మొదటి స్థానంలో ఉండే విధంగా పెన్షన్ పంపిణీ వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పేర్కొన్నారు…
అనంతరం కలెక్టర్ నగరంలోని జొహరాపురంలో కె.సి. కెనాల్ ప్రాంతాన్ని, డంప్ యార్డ్ ను పరిశీలించారు.. కె.సి. కెనాల్ లో పొరపాటున జారీ పడకుండా కంచెలు వేయించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు..డంప్ యార్డ్ ను శుభ్రం చేయించాలని సూచించారు..జొహరాపురం నుండి వెంకాయపల్లె వరకు 3 కిలోమీటర్ల రోడ్డు వేయించాలన్నారు..రోడ్లను శుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు ..జొహరాపురం ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకొని రాగా సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు…
కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్ర బాబు, డిఆర్డిఎ పిడి శివ నాగలీల తదితరులు పాల్గొన్నారు..