
దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ
హొళగుంద,న్యూస్ వెలుగు ; నీతి ఆయోగ్ ద్వారా adip స్కీం లో భాగంగా అస్పిరేషనల్ హోళగుంద బ్లాక్లో 17 సెప్టెంబర్ 2024న దివ్యాంగులకు సహాయాలు ఉపకరణాల పంపిణీ చేశారు. అర్హులైన లబ్దిదారులందరు హొళగుంద మండల ఆఫీస్ దగ్గర జరుగుతున్న మీటింగ్ కు హాజరైన దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ చేయబడుతుందని ఈ సమావేశానికి రాజకీయ నాయకులు, జిల్లా అధికారులు మండల స్పెషల్ ఆఫీసర్ హాజరు అవుతారని ఎంపీడీవో సుహాసనమ్మ , రవిశంకర్ తెలిపారు.లబ్ది దారులు ఈ మీటింగునకు తీసుకురావాల్సిన పత్రాలు:
1. వైకల్యం సర్టిఫికేట్ (సదరన్ సర్టిఫికేట్),2. ఆధార్ కార్డ్, 3. డిసెంబర్ నెలలో ఎంపీడీవో ఆఫీస్ నందు జరిగిన సదరన్ క్యాంపులో డాక్టర్స్ చెక్ చేసి ఇచ్చిన స్లిప్.సహాయాలు, ఉపకరణాల రకాలు:1. మోటార్ సైకిళ్ళు(Motorcycles) – 16, 2. చక్రాల కుర్చీలు(wheelchairs) – 13, 3. ట్రై సైకిళ్లు(Tricycles) – 47
మొత్తము: 76 ఇవ్వడం జరుగుతుందన్నారు.