జూనియర్ కళాశాలలో ప్రారంభమైన డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకం

జూనియర్ కళాశాలలో ప్రారంభమైన డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకం

హోలగుంద,న్యూస్ వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం శనివారం స్థానిక జూనియర్ కళాశాల నందు ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళాశాల చైర్మన్ రాజ పంపన్న గౌడ్,ఎస్ఐ బాల నరసింహులు,ఎంపీపీ తనయుడు ఈసా,మాజీ సర్పంచ్ మరియు టిడిపి మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విద్యార్థులకు న్యూట్రిషన్ ఫుడ్ అందజేయాలని,హాజరు శాతాన్ని పెంచాలని,విద్యార్థుల డ్రాప్ అవుట్ తగ్గించాలని, మరియు కళాశాలలో హెల్తీ అట్మాస్పియర్ ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభించిందన్నారు.కావున విద్యార్థులందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని పౌష్టికాహారాన్ని సేవించి ఆరోగ్యవంతంగా ఉండాలని కోరారు.అంతేకాకుండా విద్యార్థులు మంచిగా చదివి కళాశాలకు గ్రామానికి,తల్లిదండ్రులకు,మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ,ఎంఈఓ 2 జగన్నాథ,జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నజీర్ అహ్మద్,విక్రం రాజు,గోపాల్ రెడ్డి, దుర్గ ప్రసాద్,మోహిన్,శేషప్ప, షేక్షావలి మల్లయ్య బుడగ జంగాల రామాంజనేయులు,కూటమి నాయకులు ఆదామ్, అశోక్,తిక్క స్వామి, జాకీర్ బీరప్ప ఈరప్ప కళాశాల అధ్యాపకులు,విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!