
జాతీయ క్రీడలకు ఎంపికపైన క్రీడాకారులను అభినందించిన డాక్టర్. శంకర్ శర్మ
న్యూస్ వెలుగు, కర్నూలు; కర్నూలులోని సంకల్ బాగ్ వద్దనున్న చిన్మయ మిషన్ విద్యాలయానికి చెందిన విద్యార్థులు కరాటే లో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. క్రీడాకారులను అభినందించేందుకు పాఠశాలలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమానికి డాక్టర్. శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని కరాటే క్రీడాకారులను సన్మానించారు. అండర్-19,అండర్-17, అండర్-14 విభాగంలో మొత్తం 16 మంది క్రీడాకారులు జాతీయ కరాటే పోటీలకు ఎంపిక అయ్యారు. వీరు మద్యప్రదేశ్, దిల్లీ, పంజాబ్ రాష్ట్రాలకు వెళ్లనున్నారు. ఈసందర్భంగా డాక్టర్. శంకర్ శర్మ మాట్లాడుతూ దూర ప్రాంతాలకు వెళ్తున్న క్రీడాకారులు ఆరోగ్యం పై దృష్టి పెట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. క్రీడాకారుల వెంట తల్లిదండ్రులు వెళ్లాలన్నారు. మహిళలపై ఆత్యాచారాలు జరగకుండా ఉండాలంటే వారు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకోవాలని కోరారు. కరాటే వల్ల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈసందర్భంగా జాతీయ స్థాయి పోటీలకు వెళ్లే విద్యార్థులకు డాక్టర్. శంకర్ శర్మ స్వేటర్లను పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో చిన్మయ మిషన్ పాఠశాల ప్రిన్సిపాల్ స్వర్ణలత, కరాటే కోచ్ ఆరీఫ్, జగదీష్, క్రీడాకారులు పాల్గొన్నారు.